Saturday, September 8, 2007

మోజర్ బేర్ సంస్థతో మూడు తమిళ చిత్రాల నిర్మాణానికి ప్రకాశ్ రాజ్ ఒప్పందం.

ప్రముఖ తెలుగు, తమిళ నటుడు ప్రకాశ్ రాజ్ కు సంభంధించిన "డ్యూయెట్ మూవీస్" సంస్థతో కార్పోరేట్ సంస్థ "మోజర్ బేర్ " మూడు చిత్రాల నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో తమిళంలో ప్రకాశ్ రాజ్ నిర్మించిన "అళగియదేగే", "పొయ్","మొళి" చిత్రాలు తమిళ నాట మంచి విజయాన్ని సాధించాయి. దాంతో మోజర్ బేర్ సంస్థ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా ప్రకాశ్ రాజ్ సహనిర్మాణత్వంలో మొజర్ బేర్ సంస్థ "వెళ్ళితిరై", "అభియుం నానుం", "మయిల్" అనే మూడు చిత్రాలను ఏక కాలంలో నిర్మిస్తుంది. వీటిలో "వెల్లితిరై" చిత్రంలో ప్రకాశ్ రాజ్, పృథ్వి రాజ్ లు ప్రధాన పాత్ర ధారులుగా విజ్జి దర్శకత్వంలో, రెండవదైన "అభయుం నానుం" చిత్రంలో ప్రకాశ్ రాజ్, త్రిష లు నాయికానాయకులుగా రాధా మోహన్ దర్శకత్వంలో, మూడవదైన "మయి" చిత్రాన్ని మొత్తం కొత్తవారితో, జీవన్ దర్శకత్వంలో నిర్మిస్తారు.

No comments: