Tuesday, September 4, 2007

మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్న "చిరుత".


ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో చిరంజీవి తనయుడు రాం చరన్ తేజ నటించనున్నాడు.
గీతా ఆర్ట్స్ అధినేత రాం చరన్ తేజకు స్వయానా మామయ్య అయిన అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో ఉంటుంది. ఈ లోగా రాజమౌలి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించే చిత్రంలో రాంచరన్ తేజ నటిస్తాడు. మురుగదాస్ గతంలో చిరంజీవి నటించిన "స్టాలిన్" చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తున్న "గజినీ" కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం ద్వితీయార్ధానికి పూర్తవుతుంది. తదనంతరం రాంచరన్ తేజ చిత్రం ప్రారంభమౌతుంది.

No comments: