Wednesday, September 12, 2007

ఛార్మీ, దేవి శ్రీ ప్రసాద్ ల ప్రేమ కథ సుఖాంతమౌతుందా...?.




ఏమో ఎవరికి తెలుసు. అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు, కానీ ఛార్మీ, దేవి శ్రీ ప్రసాద్ ల పెళ్ళి స్వర్గంలో జరగలేదేమోననే అనుమానాలు ప్రస్తుతం టాలీవుడ్ లో వ్యాపించాయి. నటి ఛార్మీ, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ లు ఒకప్పుడు ఒకరికి ఒకరం అనుకుంటూ టాలీవుడ్ లో ఎక్కడ చూసినా వారే కనిపించారు. కొన్ని మార్లు సినిమా ఫంక్షన్ లలో, పార్టీలలో కూడా దర్షణమిచ్చిన వీరి ప్రేమకథను సుఖాంతం చేయాలని చార్మి తండ్రి రచయిత సత్యమూర్తి దేవి శ్రీ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెలితే అక్కడ "నో" అనే సమాధానం వచ్చిందని టాలీవుడ్ లో ఒకటే గోల. అయితే ఇప్పుడిప్పుడే మ్యూజిక్ నుంచి కథానాయకునిగా కూడా మారుతున్న దేవి శ్రీ ప్రసాద్ కొన్నాళ్ళు పెళ్ళిని వాయిదావేయడానికి ప్రయత్నిస్తున్నాడని, దాంతో ఛార్మీ తండ్రికి "నో" చెప్పినట్లు తెలిసింది. దాంతో భాధపడిన ఛార్మీ ఏవిషయంపై ఆసక్తిగా ఉండకుండా ఎప్పుడూ పరధ్యానంగా ఉంటున్నట్లు తెలిసింది.

No comments: