Friday, September 28, 2007

స్వీయ దర్శకత్వంలో "నర్తనశాల" చిత్రాన్ని పునర్నిర్మించనున్న బాలకృష్ణ







స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన ఆణిముత్యం "నర్తనశాల" చిత్రాన్ని పునర్నిర్మించాలన్న బాలకృష్ణ కోరిక తీరకుండా గతంలో అది మద్యలోనే ఆగిపోయింది. "నర్తనశాల" చిత్రాన్ని తాను అర్జునుడుగా, బృహన్నలగా ద్విపాత్రాభినయం చేస్తూ, తన దర్శకత్వంలోనే నిర్మించాలన్నది బాలకృష్ణ కోరిక.
దానికి తగ్గట్లుగానే గతంలో ఈ చిత్రాన్ని ప్రారంభంచారు కూడా.అప్పట్లో సౌందర్యను ద్రౌపదిగా, తాను అర్జునిగా కొంత షూటింగ్ కూడా జరిగిన తర్వాత, అనుకోని అవాంతరాలవల్ల ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఈ చిత్రాన్ని తప్పకుండా నిర్మించాలని కోరుకుంటున్న బాలకృష్ణ, వచ్చే సంవత్సరం ద్వితీయార్దంలో దీనికి ముహూర్తం పెట్టినట్లు తెలిసింది. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నిర్మించే "రంగా-పాండురంగా" చిత్రం పూర్తయిన తర్వాత ఈ "నర్తనశాల" ను ప్రారంభిస్తానని ఆయన తన కుటుంబీకులకు, స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది.

No comments: