Monday, September 17, 2007

రెమ్యునరేషన్ పెంచేసిన శ్రియా సరన్







"శివాజి" చిత్రంతో ఆ చిత్ర కథానాయిక పంట పండినట్లైంది. అంతదాకా అందరికీ అందుబాట్లోని కథానాయికగా పేర్గాంచిన శ్రియ ఇప్పుడు చుక్కలను తాకుతోంది.
"శివాజి" చిత్రంతో వచ్చిన క్రేజ్ తో ఆమె ఇప్పుడు తన రెమ్యునరేషన్ ను ఒక్కసారిగా పెంచేసింది. గతంలో 15 నుంచి 20 దాకా వున్న శ్రియ రెమ్యునరేషన్ ఒక్కసారిగా 40దాటిందని తమిళ నిర్మాతలు గోల గోల చేస్తున్నారు. ఇక కమర్షియల్ కార్యక్రమాలకు కూడా శ్రియ తీసుకుంటున్న రెమ్యునరేషన్ బాలీవుడ్ భామినుల స్థాయిలో ఉందని తెలిసింది. ఇటీవల చెన్నయ్ లో జరిగిన ఓ షోరూం ప్రారంభోత్సవానికి ఏకంగా 10 లక్షలు తీసుకుందని తెలిసింది. ఇది ఓ మోస్తరు నటీమణులు తీసుకునే రెమ్యునరేషన్ కు రెండింతలు. తమిళ నాడు సెక్సీ క్వీన్ నమిత సహితం ఓ కాయక్రమానికి 2 లక్షలు మాత్రమే తీసుకుంటుండగా, శ్రియ ఏకంగా పది లక్షలుతీసుకోవడంతో సదరు చిత్ర నిర్మాతలు శ్రియ తో సినిమా అంటేనే కోలీవుడ్ లో భయపడుతున్నట్లు తెలిసింది.

No comments: