Monday, September 3, 2007

పిరమిడ్ విడుదల చేస్తున్న కృష్ణవంశీ "చందమామ".



నవదీప్, శివబాలాజీ, కాజల్, సింధు మీనన్ లు నటించిన "చందమామ" చిత్రం ఈ నెల 6న విడుదలవుతోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రేఖా కంబైన్స్ సమర్పణలో, తేజ సినిమా బ్యానరుపై సి.కల్యాణ్, ఎస్.విజయానంద్ లు నిర్మించిన ఈ చిత్రం తొలి కాపీ సిద్దమైంది. పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ విడుదల చేస్తున్న ఈ చిత్రం అద్భుతమైన ప్రేమ కథతో రూపుదిద్దుకుంది. స్నేహం, ప్రేమ, కుటుంబ గౌరవం, ఆత్మీయతలు, అనురాగాల నేపద్యంగా తెలుగు వాతావరణాన్ని అతి సుందరంగా చిత్రించిన ఈ చిత్రం తెలుగు సినిమా ప్రపంచంలో మరో ఆణి ముత్యం అవుతుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ చిత్ర ఆడియోకు మంచి స్పందన వచ్చిందని వారు తెలిపారు. ఈ చిత్రానికి కె.ఎం.రాధాకృష్ణన్ సంగీతాన్ని అందించారు.

No comments: