Thursday, September 20, 2007

ఎన్.టి.ఆర్ "కంత్రీ"


యంగ్ ఎన్.టి.ఆర్ కంత్రీగా ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత సి.అశ్విని దత్ తన వైజయంతి పిక్షర్స్ బ్యానరుపై నిర్మించనున్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నాడు. హాన్సికా మోత్వాని కథానాయికగా ఎన్నికైన ఈ చిత్రం పూజాకార్యక్రమాలను ఈ శుక్రవారం పూర్తిచేసి, ఈ అక్టోబర్ 22నుంచి రెగ్యులర్ షూటింగ్ ను జరపనున్నారు.

కథాపరంగా కొన్ని రోజులు లండన్ లో, మరికొన్ని రోజులపాటు ఆస్టేలియాలో షూటింగ్ జరిపినతర్వాత మిగిలిన రెగ్యులర్ షూటింగ్, ఇతర పాటలు, టాకీని ఇండియాలో, ఆంద్రప్రదేశ్ లో షూటింగ్ జరిపి వచ్చే వేసవికి చిత్రాన్ని విడుదలకు సిద్దం చేస్తారు. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి చిత్రాల సమరంలో నిలపాలని ముందుగా అనుకున్నా, అప్పుడు ఎన్.టి.ఆర్ బాబాయ్ బాలక్రిష్ణ నటిస్తున్న "ఒక్క మగాడు" విడుదల ఉండటంతో ఈ చిత్రాన్ని వేసవికి వాయిదా వేసినట్లు తెలిసింది. కాగా ఈ చిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడు మణిశర్మ ఇప్పటికే ట్యూన్స్ సిద్దం చేసినట్లు తెలిసింది.

No comments: