Friday, September 7, 2007

ఉత్తమనటులుగా రజినీ, కమల్ లకు తమిళనాడు ప్రభుత్వ అవార్డులు.




తమిళనాడు ప్రభుత్వం ప్రతిసంవత్సరం ఇచ్చే ప్రభుత్వ అవార్డులలో 2005,06 సంవత్సరాలకుగాను రజినీ కాంత్, కమల్ హాసన్ లను ఉత్తమ నటులుగా ప్రభుత్వం ఎన్నుకుంది."చంద్రముఖి" చిత్రానికిగాను రజినీ కాంత్ కు, "వేట్టైయ్యాడు విళైయ్యాడు" చిత్రానికి గాను కమల్ హాసన్ లను ప్రభుత్వం ఎన్నుకుంది. అలాగే ఉత్తమ నటికి ఇచ్చే అవార్డులకు గాను జ్యోతిక, ప్రియామణి లను ఎన్నుకుంది. కాగా 2005 సంవత్సరానికిగాను ఉత్తమ చిత్రాలుగా "చంద్రముఖి", 'గజిని" చిత్రాలకు, 2006వ సంవత్సరానికిగాను "వెయిల్" చిత్రాన్ని ఎన్నుకుంది.

No comments: