Saturday, September 29, 2007

బాలీవుడ్ వైపు "చిరుత" చూపు


చిరంజీవి తనయుడు రాం చరన్ చూపు బాలీవుడ్ పై బడిందని తెలిసింది. "చిరుత" చిత్రం విడుదల సందర్బంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో జరిగిన ప్రివ్యూ షోలో రాం చరన్ తన మనసులోని మాటను "CNN-IBN " విలేఖరితో పంచుకున్నారు. ఈ సందర్బంగా " CNN-IBN" విలేఖరి శ్వేతల్ కంప్లపూర్కర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా "తన తొలి ప్రాధాన్యత తెలుగుకే, అయితే మంచి కథ వస్తే మాత్రం బాలీవుడ్ లో నటిస్తాను. అటువైపునుంచి, ఇప్పటికే కొందరు దర్శకులు తనను సంప్రదించడం జరిగిందని, అయితే కథ నచ్చక వాటిని ఒప్పుకోలేదని అన్నారు. అలాగే తెలుగులో తన ద్వితీయ చిత్రానికి రాం దర్శకుడని, దీనిని తన మావయ్య అల్లు అరవింద్ నిర్మిస్తారని" తెలిపాడు.

No comments: