Monday, September 10, 2007

"మల్లన్న" గా వస్తున్న విక్రం.


యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్రం తన తదుపరి చిత్రంలో "మల్లన్న" గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగు, తమిళ భాషలలో రూపొందిన "కందస్వామి" తెలుగులో "మల్లన్న"గా పేరు మార్చుకుని మన ముందుకు రానుంది.
విక్రం ఇంతక్రితం నటించిన "భీమ" ఆర్థికపరమైన ఇబ్బందులవల్ల ఇంకా విడుదల కాకముందే తదుపరి చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి సంభంధించిన డబ్బింగ్ పనులు కొనసాగుతుండగా, చివరి షెడ్యూల్ మరో రెండు రోజులలో పూర్తవుతుందని తెలిసింది. కలైపులి థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుసి గణేషన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర పాటలలను వచ్చే వారంలో విడుదల చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో విక్రం సరసన శ్రేయ కథానాయకిగా నటించింది.

No comments: