Monday, September 10, 2007

రజినీ కాంత్, మణిరత్నంల చిత్రంలో నటిస్తూ నిర్మించనున్న కమల్ హాసన్.

ఒక్కోసారి మంచి కాంబినేషన్ల కలయిక సగటు ప్రేక్షకునికి ఆనందాన్ని కలిగిస్తుంది. తెలుగు నాట మల్టీ స్టారర్ చిత్రాల విశయంలో ఆశించదగ్గ పరిణామం చోటుచేసుకోవడం లేదు కానీ, తమిళ నాట ఓ భారీ ప్రయత్నానికి అంకురార్పణ జరిగింది. తమిళ నాట తిరుగులేని కథానాయకులైన రజినీ కాంత్, కమల్ హాసన్ లు ఒకే చిత్రంలో కలిసి నటించనున్నారు.ఈ భారీ చిత్రం ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. దీనికి సంభంధించిన ప్రాధమిక కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఇక షూటింగ్ మాత్రమే మిగిలింది. అయితే ఈ చిత్రాన్ని తానే నిర్మించదలచినట్లు కమల్ హాసన్ దర్శకుడు మణిరత్నంతో చెప్పినట్లు తెలిసింది. నిజానికి మణిరత్నమే ఈ చిత్రాన్ని తన స్వంత "మద్రాస్ టాకీస్" బ్యానరుపై చిత్రించాలని అనుకున్నారు. కాగా కమల్ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. రజినీ కాంత్, కమల్ హాసన్ లు కలిసి నటించడం దాదాపు ఖాయమేనని కోలీవుడ్ తెలిపింది. ఇటీవలే రజినీ కాంత్, కమల్ హాసన్ లు కమల్ హాసన్ ఇంట్లో కలుసుకుని ఏకాంతంగా మాట్లాడుకోవడం కోసం కమల్ కారులో కలిసి ఓ కల్యాణ మండపం ఆఫీసుకు వెల్లి చాలాసేపు మనసులు విప్పి మాట్లాడుకున్న తర్వాత కలిసి నటించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని తమిళ పత్రికలు సహితం దృవీకరించడ తో తమిళ నాట రజినీ కాంత్, కమల్ హాసన్ ల భారీ చిత్రం నిజమేనని తేలింది.ఇందులో రజినీ కాంత్ సరసన ఐశ్వర్య రాయ్ కథా నాయికగా దాదాపు ఖరారైంది. ఇక మిగిలిన తారాగనం ఎన్నిక పూర్తయితే షీటంగ్ మాత్రమే పెండింగ్ ఉంటుందని తెలిసింది.

No comments: