Saturday, September 29, 2007

తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అభినందనలు పొందిన విశాల్ "భయ్యా"











యువ నటుడు విశాల్ నటించిన ద్విభాషా చిత్రం "భయ్యా" తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అభినందనలు పొందింది. నిన్ననే (శుక్రవారం) తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం తమిళ వర్షన్ "మలైకోట్టై" ని ముఖ్యమంత్రి కరుణానిధి ప్రత్యేకంగా చూసారు. చిత్రీకరణ పద్దతులు, సాంకేతికత, ముఖ్యంగా విశాల్ నటన చాలాబావున్నాయని, నటుడు విశాల్ కు సినీ పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉందని ఆయన అభినందించారు. తెలుగులో కూడా ఈ వారమే ఈ చిత్రం విడుదల కావలసి ఉన్నా, చిరంజీవి తనయుని "చిరుత" విడుదల ఉండటం వల్ల దీనిని వచ్చే వారానికి వాయిదా వేశారు.

No comments: