Saturday, September 29, 2007

స్వర్గీయ ఎన్.టి.ఆర్ ను ఎండలో నిలబెట్టిన హీరో




స్వర్గీయ ఎన్.టి.ఆర్ తెలుగు వారి ఆరాధ్య నటునిగా ప్రజలచేత నీరాజనాలు అందుకున్నారు. సినీ పరిశ్రమ మొత్తం ఆయనకు అగ్ర హీరోగా ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. అయితే అలాంటి ఎన్.టి.ఆర్ ను సహితం ఎండలో నిలబెట్టిన హీరో అలనాటి మేటి హీరో సి.హెచ్.నారాయణ రావు.


ఎన్.టి.ఆర్ సినీపరిశ్రమలోకి వచ్చేముందు కొన్ని రోజుల క్రితం అప్పటి నంబర్ వన్ హీరో సి.హెచ్.నారాయణ రావును ఒకసారి చూద్దామని ఆయన షూటింగ్ జరుగుతున్న వాహిని స్టూడియోకు వెళ్ళాడు. లోపల మేకప్ రూంలో మేకప్ చేసుకుంటున్న సి.హెచ్.నారాయణ రావును తాను కలవాలనుకుంటున్నటు గేట్ దగ్గరున్న వాచ్ మెన్ కు చెప్పి పంపించాడు ఎన్ టి ఆర్. అది విన్న నారాయణ రావు "తను, ఎందుకు వచ్చాడో తెలుసుకొమ్మని" తిరిగి వాచ్ మెన్ కు పురమాయించాడు. అప్పుడు "తాను, సినిమాలలో నటించడానికి మద్రాసు వచ్చాననీ, నారాయణ రావు సినిమాలను చాలాసార్లు చూసాననీ, ఆయనపై ఉన్న గౌరవంతో ఒకసారి చూడడానికి వచ్చాననీ" చెప్పాడు. అది విన్న నారాయణ రావు నాకిప్పుడు పని ఉంది, నన్ను చూడాలనుకుంటే ఓ రెండు, మూడు గంటలు బయటే వేచిఉండాల్సి వస్తుందని వాచ్ మెన్ తో చెప్పి పంపించాడు. అది విన్న ఎన్ టి ఆర్ కాసేపు ఆలోచించి నారాయణ రావు బయటికి వచ్చేదాకా ఎండలోనే వేచి యున్నాడు. రెండు, మూడు గంటలనుకుంటే అది కాస్తా ఐదు గంటలైన తర్వాత బయటికి వచ్చిన నారాయణ రావు ఎన్ టి ఆర్ ను పలకరించి, సినీ పరిశ్రమలో ఇదంతా మామూలని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతి కొద్ది కాలంలోనే నారాయణ రావు వెనకబడడం, ఎన్ టి ఆర్ నంబర్ వన్ స్థానాన్ని చేరుకోవడం జరిగిపోయాయి. ఆ తర్వాత నారాయణ రావుకు వేషాలే కరువయ్యే పరిస్తితి వచ్చింది. అటువంటప్పుడు ఎన్ టి ఆర్ తనకు తెలిసిన నిర్మాతల చిత్రాలలో ఆయనకు వేశాలు ఇప్పించేవాడని, ఆ తర్వాత ఒకసారి తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో నారాయణ రావే స్వయంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత సినీ పరిశ్రమలో చాలామంది తనను ఎన్ టి ఆర్ ను ఎండలో నిలబెట్టిన హీరో అని అంటుండేవారని, అది తెలిసిన ఎన్ టి ఆర్, నారాయణ రావుతో "ఇవన్నీ సినీ పరిశ్రమలో సాధారణం, పట్టించుకోకండి..." అన్నారనీ మరోమారు నారాయణ రావే గుర్తుచేసుకున్నారు.

నయనతార గ్లామర్ గ్యాలరీ













బాలీవుడ్ వైపు "చిరుత" చూపు


చిరంజీవి తనయుడు రాం చరన్ చూపు బాలీవుడ్ పై బడిందని తెలిసింది. "చిరుత" చిత్రం విడుదల సందర్బంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో జరిగిన ప్రివ్యూ షోలో రాం చరన్ తన మనసులోని మాటను "CNN-IBN " విలేఖరితో పంచుకున్నారు. ఈ సందర్బంగా " CNN-IBN" విలేఖరి శ్వేతల్ కంప్లపూర్కర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా "తన తొలి ప్రాధాన్యత తెలుగుకే, అయితే మంచి కథ వస్తే మాత్రం బాలీవుడ్ లో నటిస్తాను. అటువైపునుంచి, ఇప్పటికే కొందరు దర్శకులు తనను సంప్రదించడం జరిగిందని, అయితే కథ నచ్చక వాటిని ఒప్పుకోలేదని అన్నారు. అలాగే తెలుగులో తన ద్వితీయ చిత్రానికి రాం దర్శకుడని, దీనిని తన మావయ్య అల్లు అరవింద్ నిర్మిస్తారని" తెలిపాడు.

తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అభినందనలు పొందిన విశాల్ "భయ్యా"











యువ నటుడు విశాల్ నటించిన ద్విభాషా చిత్రం "భయ్యా" తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అభినందనలు పొందింది. నిన్ననే (శుక్రవారం) తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం తమిళ వర్షన్ "మలైకోట్టై" ని ముఖ్యమంత్రి కరుణానిధి ప్రత్యేకంగా చూసారు. చిత్రీకరణ పద్దతులు, సాంకేతికత, ముఖ్యంగా విశాల్ నటన చాలాబావున్నాయని, నటుడు విశాల్ కు సినీ పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉందని ఆయన అభినందించారు. తెలుగులో కూడా ఈ వారమే ఈ చిత్రం విడుదల కావలసి ఉన్నా, చిరంజీవి తనయుని "చిరుత" విడుదల ఉండటం వల్ల దీనిని వచ్చే వారానికి వాయిదా వేశారు.

"వనజ" హైదరాబాద్ ఎప్పుడొస్తుంది..?







_"ఏందో ఈ జీవితం. నాజీవితాన్ని నాదిగా బతుకనీరు ఓ ఆశా పడనీరు ఓ కోరికా తీరనీరు. నేనేమైనా యిమాన మెక్కుతానన్నానా లేక అమెరికా చూపమన్నానా, కొద్దిగా డ్యాన్సేగా నేను నేర్చుకుంటానంతోంది..."_ అనుకుంటూ తనలో తనే నలిగిపోతూ తన హృద్యమైన భావాలను, భావనలను అంతర్జాతీయ ప్రేక్షకలోకంలో పంచుకున్న "వనజ" సొంత ఊరు హైదరాబాద్ కు ఎప్పుడొస్తుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న?. పద్నాలుగేళ్ళ ప్రాయంలోని వనజ లేలేత స్వప్నాలకు నిర్దయపూరితమైన వాస్థవ ప్రపంచం, కులం కుళ్ళూ,అమ్మాయనే లైంగిక వివక్షా ఆ పసి హృదయంపై చూపిన ప్రభావాన్ని ప్రభొదాత్మకంగా చిత్రించిన హైదరబాదీ దర్శకుడు రజినీశ్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా అనేక వేదికలలో ప్రదర్శించి అవార్డులనూ, ప్రేక్శకుల రివార్డులనూ అందుకున్నా, స్వంత ప్రాంతంలో స్వంతవారి మద్యన ఈ చిత్రాన్ని ప్రదర్శించలేదనే విశయాన్ని గమనించి అందుకుతగ్గ ప్రయత్నాలు చేస్తే బావుంటుంది. తన దర్శకత్వ ప్రతిభతో అద్భుత చిత్రాన్ని రూపొందించిన తను ఇక ముందు కూడా విలువలకు తిలోదకాలివ్వకుండా మంచి చిత్రాలను రూపొందించాలని ఆశిస్తున్నాము.

ఆస్కార్ లక్ష్యంగా నిర్మాణం జరుపుకుంటున్న కమల్ హాసన్ "దశావతారం" చిత్రం







ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్కార్ అవార్డు లక్ష్యంగా "దశావతారం" చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. గతంలో దక్షిణ భారత దేశం నుంచి తొలిసారిగా ఆస్కార్ అవార్డుకు నామినేషన్ పొందిన "స్వాతిముత్యం" హీరోపై మాకా నమ్మకం ఉందని నిర్మాత చెబుతుండటం గమనార్హం.
దక్షిణ భారత దేశంలోని సృజనాత్మక నటులలో ఒకరైన కమల హాసన్ నటిస్తున్న "దశావతారం" చిత్రం లోని సునామీ దృశ్యీకరణ ప్రేక్షకులకు విస్మయాన్ని కలిగించనుంది. పూర్తి స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలను జోడిస్తూ చిత్రిస్తున్న ఈ చిత్రంలో ఒక సందర్భంలో సునామీని సృష్టించారు. గత రెండు సంవత్సరాల క్రితం తమిళనాడులో వచ్చిన సునామీ వల్ల కొన్ని వందల కుటుంబాలు అనాదలయ్యాయి. కొన్ని వందల మంది సునామీలో కొట్టుకునిపోయి చనిపోయారు.కొన్ని వేల మంది ఉపాదిని కోల్పోయారు. ప్రకృతి సృష్టించిన ఈ వైపరీత్యం వల్లజరిగిన నష్టం ఊహకందనిది. ఇప్పటికీ కొన్ని కుటుంబాలవారు ఇంకా కోలుకోలేదంటే ఆ విపత్తు సామాన్యమైనదేమీ కాదు. అలాంటి సునామీని ప్రేక్షకులకు "దశావతారం" చిత్రంలో కల్లకు కట్టినట్లు చూయించనున్నారు. ఇందుకోసం భారీయెత్తున సాంకేతిక పరికరాలను, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లను చెన్నై తరలించి సునామీ దృష్యాల చిత్రీకరణగావించారు. ఇందులో కమల హాసన్ దశ అవతారాలలో కనిపించనున్నారు. అందులో సుమారు తొమ్మొది రకాల పాత్రలను సునామీ సందర్బంలో ఏక కాలంలో పోషించనున్నారు. దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించడంతోబాటు, వచ్చే సంవత్సరం ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డులకు పంపడం తమ లక్ష్యంగా దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.

గ్లామరే నా ఆయుధం,నెంబర్ వన్ నా లక్ష్యం-"కంత్రి" హీరోయిన్ హాన్సికా మోత్వాని




ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లోకి అడుగు పెడుతూనే "నంబర్ వన్ నా లక్ష్యమని" "కంత్రి" హీరోయిన్ హాన్సికా మోత్వాని ప్రకటించేసింది.

నా మనసు నిండా ఆత్మ విశ్వాసం మెండుగా ఉండి. గ్లామర్ అనే ఆయుధం నా చేతిలో ఉంది. ఇక విజయమే మిగిలి ఉంది, అని ఆత్మ విశ్వాసంతో ప్రకటిస్తున్న ఈ చిన్నది "ఎన్.టి.ఆర్ "కంత్రీ" చిత్రంపై పెద్ద ఆశలే పెట్టుకుంది. మరో రెండు పెద్ద కంపనీలలో, యువ నటులతో నటిస్తున్న హాన్సిక "చేతిలోని మూడు తెలుగు ప్రాజెక్టులూ, సక్సెస్ నిచ్చేవేనని" ముంబై సన్నిహితులతో ఘంటాపదంగా సెలవిస్తోంది.తాను అతి త్వరలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుంటానని కూడా చెబుతున్నట్లు ముంబై పత్రికలలో మసాలా వార్తలు వస్తున్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ హాన్సికా.

గ్లామర్ హీరోయిన్ నమిత పోటో గ్యాలరీ











Friday, September 28, 2007

జాతీయ జెండాను కించపరచినందుకు అమీర్ ఖాన్ కు అరెస్ట్ వారెంట్




బాలీవుడ్ కథానాయకులు ఒక్కరొక్కరుగా జైలుకువెలుతున్నారు.గతంలో నటులు సంజయ్ దత్, ఆతర్వాత సల్మాన్ ఖాన్ లు జైలుకు వెళ్ళి వచ్చారు. ఇప్పుడు అమీర్ ఖాన్ వంతైంది.


ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్స్ షోరూం ఓపెనింగ్ కు అమీర్ ఖాన్ ముఖ్య అథిధిగా వచ్చారు. అప్పుడు ఆ షోరూం పైభాగంలో 11 జాతీయ జెండాలను ఎగురవేశారు. నిబంధనల ప్రకారం జాతీయ జెండాను సూర్యాస్తమయం తరువాత ఎగురవేస్తే దాన్ని జాతీయ జెండాను కించపరచబడినట్లుగా భావించి, అందుకు భాద్యులైన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు కార్యక్రమం పూర్తయినా జెండాలను నిభందనల ప్రకారం క్రిందికి దించలేదు. ఈ విషయం కార్ల షోరూం యజమానుల దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత రాత్రి సమయంలో హడావిడిగా వాటిని క్రిందికిదించారు. అయితే సదరు కార్ల షోరూం యజమానులైన అశోక్, రాజేశ్ రాజ్పాల్ లు, ఆ కార్యక్రమానికి ముఖ్య అథిధిగా వచ్చిన నటుడు అమీర్ ఖాన్ లు ఈ విషయాన్ని పట్టించుకోలేదని, ఇది ఉద్దేష్యపూర్వకంగా చేసిన చర్యగా భావించి ఈ ముగ్గురిపై చర్య తీసుకోవలసిందిగా కోరుతూ స్థానిక న్యాయవాది శైలేంద్ర శర్మ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన న్యాయాధికారి ఆ ముగ్గురికి బెయిలుతో కూడిన అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మలి విచారణ అక్టోబర్ 12వ తేదీన జరుగుతుంది.

స్వీయ దర్శకత్వంలో "నర్తనశాల" చిత్రాన్ని పునర్నిర్మించనున్న బాలకృష్ణ







స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన ఆణిముత్యం "నర్తనశాల" చిత్రాన్ని పునర్నిర్మించాలన్న బాలకృష్ణ కోరిక తీరకుండా గతంలో అది మద్యలోనే ఆగిపోయింది. "నర్తనశాల" చిత్రాన్ని తాను అర్జునుడుగా, బృహన్నలగా ద్విపాత్రాభినయం చేస్తూ, తన దర్శకత్వంలోనే నిర్మించాలన్నది బాలకృష్ణ కోరిక.
దానికి తగ్గట్లుగానే గతంలో ఈ చిత్రాన్ని ప్రారంభంచారు కూడా.అప్పట్లో సౌందర్యను ద్రౌపదిగా, తాను అర్జునిగా కొంత షూటింగ్ కూడా జరిగిన తర్వాత, అనుకోని అవాంతరాలవల్ల ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఈ చిత్రాన్ని తప్పకుండా నిర్మించాలని కోరుకుంటున్న బాలకృష్ణ, వచ్చే సంవత్సరం ద్వితీయార్దంలో దీనికి ముహూర్తం పెట్టినట్లు తెలిసింది. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నిర్మించే "రంగా-పాండురంగా" చిత్రం పూర్తయిన తర్వాత ఈ "నర్తనశాల" ను ప్రారంభిస్తానని ఆయన తన కుటుంబీకులకు, స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది.

చిరంజీవి ఇంటిముందు "చిరుత" టికెట్ కోసం చేయి కోసుకున్న అభిమాని


చిరంజీవి వారసుని తొలి చిత్రం తొలి మార్నింగ్ షోలోనే చూడాలనే అభిమానం చివరికి ఆ అభిమాని చేయి కోసుకుని స్పృహ తప్పేదాకావెళ్ళింది.

ఆంద్ర రాష్ట్రంలో "చిరుత" పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక చిరంజీవి అభిమానూలకు చిరు వారసుని ఆగమనం పండగ వాతావరణాన్ని సృస్టించింది. దాంతో చిరంజీవి తనయుని "చిరుత" ను తొలి రోజు, మార్నింగ్ షోలోనే చూడాలని అందరు అభిమానులు కోరుకోవడం సహజమే. అయితే "చిరుత" కు ఉన్న క్రేజీ దృష్ట్యా టికెట్లు ఎక్కడా దొరకని పరిస్తితి నెలకొంది. దాంతో ఓ అభిమాని ఎలాగయినా సినిమా టికెట్ సాధించడం కోసం గురువారం (నిన్న)ఏకంగా చిరంజీవి ఇంటికే వెళ్ళాడు. చిరంజీవి వైపునుంచి కనీసం ఒక టికెట్ అయినా దొరకక పోతుందా అనే ఆశ తో ఆ అభిమాని చిరంజీవి ఇంటికి వెళ్ళినట్లు తెలిసింది. అయితే పూర్తి కోలాహలం మధ్యన ఆ అభిమానిని ఎవరూ పట్టించుకోలేదు. సెక్యూరిటీ వారు "అభిమానులు షరా మామూలే" అన్నట్లు ప్రవర్తించడంతో, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎదురు చూసిన ఆ అభిమాని, చివరికి తనజేబులోని బ్లేడ్ తో చేతిపై "చిరు" అని వ్రాసుకున్నాడు. దాంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. కొద్ది సేపట్లోనే ఆ అభిమాని రక్తం ఎక్కువగా పోవడం వల్ల స్పృహతప్పి పడిపోయాడు. అప్పుడు గమనించిన సెక్యూరిటీ వారు అతన్ని దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. చిరంజీవిపై ఉండే అభిమానంతో రోజూ కొన్ని వందలమంది అభిమానులు వస్తూంటారని, అందర్నీ చిరంజీవిని కలవడానికి పంపడం సాధ్యం కాదని, కాని అతను ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాడని తామెవరూ అనుకోలేదని తదనంతరం సెక్యూరిటీవారు చెబుతూడటం గమనార్హం. అయితే ఈ విషయం ఏ పత్రికలో కూడా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నా, అప్పటికే వెబ్ సైట్ లలో దర్శనమిచ్చేప్పటికి తెల్లబోవడం సెక్యూరిటీవారి వంతైంది. ఈ విషయమై చిరంజీవి మేనేజర్ సెక్యూరిటీ వారిని తీవ్రంగా మందలించి, ఇంకెప్పుడూ, అలా చేయవద్దని, ఎవరు వచ్చినా తనకు తెలియజేయవలసిందిగా చెప్పినట్లు తెలిసింది.

అక్టోబర్ 25న లవ్ మ్యారేజ్ చేసుకోనున్న భూమికా చావ్లా







తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో లక్షలాది అభిమానులుగల భూమికా చావ్లా ఎట్టకేలకు తను ప్రేమించిన యోగా టీచర్ భరత్ ఠాగూర్ ను అక్టోబర్ 25వ తేదీన గోవాలో వివాహం చేసుకోనుంది.
గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న వీరి ప్రేమ పెద్దల అనుమతితో చివరికి కళ్యాణ బంధంతో ముడిపడనుంది. పలు తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించిన భూమికా చావ్లా ప్రస్తుతం "అనసూయ", "స్వాగతం" తెలుగు చిత్రాలలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు దాదాపు పూర్తయ్యాయి. ఇంకా రెండు సినిమాలకు భూమిక సైన్ చేసి ఉంది. వాటి భవిష్యత్తు తన కాబోయే వాడే నిర్ణయిస్తాడని దగ్గరివారితో చెబుతున్న భూమిక వివాహం తరువాత నటిస్తుందా, లేదా అనే విషయం ఇప్పుడిప్పుడే తెలీదు. ఎనీహౌ.."విష్ యూ హ్యాప్పీ మ్యారీడ్ లైఫ్ భూమికా" అని మనమూ అడ్వాన్స్ గానే విషెస్ చెబుదామా.

హాట్ గావుంటేనే లైం లైట్లో ఉంటాం-శ్రేయ











తన విజయ రహస్యానికి ప్రథమ సూత్రం హాట్ గా ఉండటమేనని టాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రేయ అంటోంది.




ఈ రోజులలో శృంగారంగా కనిపిస్తేనే సినీ పరిశ్రమ దగ్గరకు తీసుకుంటుందని, ఏదో కుటుంబ పక్షంలా కనిపిస్తే మనం గెలుపు పందేరంలో వెనకబడటం ఖాయమని ఆమె తెలిపింది. సినిమాలలో శృంగారంగా కనిపించడంతోబాటు, ఏవైనా సినీ ఫంక్షన్లలో కూడా తమ హీరోయిన్ గ్లామర్ గా అంటే కైపెక్కేలా ఉంటేనే బావుంటుందని దర్శక, నిర్మాతలు కోరుకుంటున్నారని, దాంతో తను సాద్యమైనంత శృంగారంగా కనిపించడంకోసం ప్రయత్నిస్తానని చెబుతున్న శ్రేయ, మనలో టాలెంట్ ఉంటే సరిపోదని, ఇలాంటి చిన్న చిన్న ప్రదర్శనలు కూడా అప్పుడప్పుడు ఇస్తుండాలని, అదే తన విజయ రహస్యమని ఆమె తన స్నేహితులతో చెబుతోంది. చెప్పడమే కాదు అదే విషయాన్ని అక్షరాలా పాఠిస్తోంది. అందుకే ఇటీవల తాను విక్రం తో కలిసి నటిస్తున్న ద్విభాషా చిత్రం "మల్లన్న" ప్రారంభ ఫంక్షన్ కు ఇలా గ్లామరస్ గానే వచ్చి అందర్నీ ఆకర్శించింది. కావలిస్తే మీరే చూడండి.

Thursday, September 27, 2007

రెమ్యునరేషన్లలో పోటీ పడుతున్న తెలుగు సినీ కథానాయకులు







తెలుగు సినిమాల బడ్జెట్ చుక్కలను తాకుతోంది. తాకుతోంది సినీ బడ్జెట్ అనేకన్నా.. తెలుగు సినీ కథానాయకుల బడ్జెట్ అంటే సమంజసంగా ఉంటుందని పలువురు నిర్మాతలు విమర్షిస్తున్నారు.
నిజానికి సినిమాల బడ్జెట్ ఒక విధంగా అందుబాటులోనే ఉంటుంది, కానీ అందుబాటులో లేనిది సినీ కథానాయకుల బడ్జెటేనని టాలీవుడ్ అంటోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అక్షరాలాఎనిమిది కోట్ల యాభై లక్షలను తన రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు. తను నటించే చిత్ర నిర్మాతనుంచి చిరంజీవి రెమ్యునరేషన్ కు బదులుగా నైజాం ఏరియా హక్కూలను తీసుకుని, వాటిని వేరేవారికి అమ్ముకోవడం ఆయన చేస్తున్న పని. గత శంకర్ దాదా జిందాబాద్ చిత్రాన్ని ఆయన ఎనిమిది కోట్ల యాభై లక్షలకు అమ్ముకున్నారు. అంటే ఆయన రెమ్యునరేషన్ ఎనిమిది కోట్ల యాభై లక్షలన్నమాట. ఇక ఆయన తర్వాత ఇప్పుడు అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు మహేశ్ బాబు, జూనియర్ ఎన్.టి.ఆర్.లే. వారు సుమారుగా ఆరు కోట్ల రూపాయలను తమ రెమ్యునరేషన్ గా కోరుతున్నారు. ఇటీవల మహేశ్ బాబు చిత్రాలు బాగా విజయవంతం కావడం, ఇక ఎన్ టి ఆర్ మార్కెట్ రేంజ్ పెరగడం తో వారు అధికంగా ఆషిస్తున్నారు. ఇక వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ,పవన్ కళ్యాన్ లు సుమారు 4.5 నుంచి 5 కోట్ల రూపాయలను ఆషిస్తున్నట్లు తెలిసింది. మిగిలిన వారి రెమ్యునరేషన్ ఎక్కువ లేకున్నా, వారి చిత్రాల మార్కెట్ తీరును దృష్టిలో వుంచుకుంటే మాత్రం వారు కూడా ఎక్కువగానే ఆషిస్తున్నారని తెలిసింది. దాంతో పలువురు చిత్ర నిర్మాతలు పెరిగింది సినిమాల బడ్జెట్ కాదు కథానాయకుల బడ్జెట్ అని చమత్కరిస్తున్నారు.

"రంగా పాండురంగా" లో నారదునిగా బ్రహ్మానందం




రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రియుల్ని కడుపుబ్బా నవ్విస్తున్న హాస్య నటుడు బ్రహ్మానందం తొలిసారిగా నారద పాత్రను పోషిస్తున్నారు.
ప్రముఖ నటుడు బాలకృష్ణ నటిస్తున్న ఈ పౌరానిక చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తూ, తనే తన ఆర్.కె ఫిలంస్ బ్యానరుపై నిర్మిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం తొలి సారిగా నారద పాత్రను పోషిస్తున్నారు. గతంలో బ్రహ్మానందం చిత్రగుప్తుని పాత్రను పలు చిత్రాలలో పోషించినా, ఇంతవరకు నారద పాత్రను పోషించలేదు. తన నట జీవితంలో ఒక్క సారైనా నారద పాత్ర పోషించాలనే బ్రహ్మానందం కోరిక ఈ చిత్రంతో తీరనుంది.


టాలీవుడ్ / కోలీవుడ్ కొత్త హీరోయిన్ దీపిక ఫోటో గ్యాలరీ







ఇలియానా చెంప పగలగొట్టిన పవన్ కళ్యాన్




మళ్ళీ పవన్ కళ్యాన్ కు కోపం వచ్చింది. ఈ సారి పవన్ కోపానికి బలి కావడం ఇలియానా వంతైంది. ఇది సినిమాలో అయితే ఎవరూ అంతగా పట్టించుకోనవసం లేదు. అయితే ఇది నిజంగానే షూటింగ్ లో ఉన్న ఇలియానాను అందరూ చూస్తుండగా పవన్ ఆమె చెంప పగలగొట్టాడని తెలిసింది.


పవన్ కళ్యన్, ఇలియానా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. త్రివిక్రం శ్రీనివాస్ దీనికి దర్శకుడు. ఏదో చిన్న విషయానికే పెద్దగా కోపం తెచ్చుకుని పవన్ ఇలియానాపై చేయి చేసుకున్నాడని, దాంతో షూటింగ్ లోనే ఏడ్చేసిన ఇలియానా, మరునాడు షూటింగ్ కు డుమ్మా కొడితే, దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ ఆమె ఉంటున్న హోటల్ కు వెల్లి ఆమెను ఓదార్చిన తర్వాతే ఆమె తిరిగి షూటింగ్ కు హాజరైందని తెలిసింది. ఈ విషయం ఫిల్మ్ ఛాంబర్ దాకా వచ్చినా ఎవరూ అధికారికంగా ఒప్పుకోకపోవడం, గుట్టుగా చర్చించుకుంటూనే, అధికారికంగా "అలాగా, మాకు తెలీదే" అనో, లేక " ఛ,అలాంటిదేం జరగక పోవచ్చు, అంతా గ్యాసిప్ అయి ఉంటుంది" అనో అంటూడడం కొస మెరుపు.

సెన్సార్ దెబ్బకు "చిరుత" విలవిల


చిరంజీవి తనయుడు సెన్సార్ వారి తొలి దెబ్బకు విలవిల లాడాడు. "చిరుత" చిత్రంలోని 53.06 మీటర్ల రీల్ సెన్సార్ వారి దెబ్బతో చిత్రంలోంచి కనుమరుగైంది. కొన్ని మాటలు, కొన్ని దృష్యాలను సెన్సార్ వారు చిత్రంలోంచి తొలగించారు. సెన్సార్ వారు తొలగించిన దృష్యాల, మాటల వివరాలు.

1.నటుడు సూర్య గొంతు కోయడం దృష్యాన్ని.

2.చివరి ఫైట్లో విలన్ నలిపివేసే 786 అక్షరాల దృష్యాన్ని.

3."ఐ లైక్ యువర్ బ్యాక్" అన్న పదాలను.

4."అన్ని మూసుకుని" అన్న పదంలోచి "అన్ని" పదాన్ని.

5."సంక నాకి", "నేనా సంకలు నాకేది" పదాలను.

6."ఫక్", "ఫకింగ్" పదాలను.

7.కత్తితో గొంతు కోస్తున్న దృష్యాలను.

8."ఆషిష్ విద్యార్తి" గొంతు కోయడం, కత్తి నుంచి బొట్లు బొట్లుగా పడుతున్న రక్తపు చుక్కలు దృష్యం.

9.క్లైమాక్స్ దృష్యాన్ని సుమారు ఇరవై శాతం దాకా కట్ చేసారు.

10.హీరోయిన్ బెడ్ రూం దృష్యాన్ని.

Wednesday, September 26, 2007

బాలీవుడ్ భామిని ఇషా కొప్పీకర్ ఫోటో






















"దశావతారం" చిత్రం కోసం కమల్ హాసన్ వెరైటీ కొత్త గెటప్


శాఖాహార ఉద్యమం చేస్తున్న బాలీవుడ్ భామిని కరీనా కపూర్


బాలీవుడ్ క్రేజీ కథానాయకి కరీనా కపూర్ శాఖాహార ఉద్యమాన్ని లేవనెత్తింది.

ఉద్యమం అంటే పెద్దయెత్తున రోడ్లపై కాదు...బాలీవుడ్ లోనే. తన సహ నటీనటుల దగ్గర చేరి మాంసాహారాన్ని మానివేయమని సలహాలు ఇవ్వడమే కాకుండా, శాఖాహారం వల్ల ఉన్న లాభాలు, మాంసాహారం వల్ల ఉన్న నష్టాలను విడమర్చి చెబుతూ అందరూ మాంసాహారాన్ని మానివేయాలని, ఇకపై శాఖాహారాన్ని మాత్రమే భుజించాలని కోరుతోంది. గత ఎనిమిది నెలల క్రితం దాకా మాంసాహారాన్ని అమితంగా ఇష్టపడే కరీనా అకస్మాత్తుగా, దానికి గుడ్ బై చెప్పి శాఖాహార వ్రతాన్ని చేబట్టింది. తను మాంసాహారాన్ని మానివేయడమే కాకుండా, తన ప్రియుడు షాహిద్ తో కూడా మాంసాహారాన్ని పూర్తిగా మానివేయించి ఇప్పుడు సహనటీ,నటుల దగ్గర తన శాఖాహార సూత్రాలను వల్లెవేస్తోంది. కొత్తగా తన గ్లామర్ రహస్యానికి శాఖాహారమే కారణమనీ సెలవిస్తోంది. ఎనీహౌ, కరీనా తన ప్రయత్నంలో విజయం సాధించాలని కోరుకుందాం.

"మల్లన్న" చిత్రంకోసం విక్రం కొత్త గెటప్