Friday, October 5, 2007

"నాకైదుగురు పిల్లలు కూడా వున్నారు, వెళ్ళి వెతకండి.." మీడియాపై రుసరుసలాడిన రాణి ముఖర్జీ


రాణీ ముఖర్జీ చాలా సున్నిత మనస్కురాలని ప్రతీతి. అయితే ఈ మారు తన సున్నితత్వాన్ని తీసి ప్రక్కకు పెట్టి, మీడియాపై రుసరుసలాడింది. ఇటీవల ముంబైలో మహిళలకోసం ప్రత్యేకంగా తయారుచేసిన క్రిస్టల్ వాచీలను మార్కెట్లోకి విడుదల చేయడానికి ఒక ప్రైవేటు ఫంక్షన్ కు వచ్చిన రాణీ ముఖర్జీతో అక్కడున్న కొందరు విలేఖరులు "ఫిలిం మేకర్ ఆదిత్య చోప్రాతో మీ పెళ్ళి అయ్యిందని వార్తలు వస్తున్నాయి, నిజమేనా " అని అడగడంతో, "మా పెళ్ళి మాత్రమేనా, నాకు ఐదుగురు పిల్లలు కూడా వున్నారు, వెళ్ళి వెతకండి, వారిని కనిపెట్టిన వారికి బహుమతి కూడా ఇస్తాను" అంటూ చిర్రుబుర్రులాడింది. అంతటితో ఊరుకోకుండా "పెన్ను ఉందికదాని తోచిందంతా రాసుకుని, జర్నలిజానికి మచ్చ తేవద్దని" విలేఖరులకు హితువుకూడా చెప్పిమరీ వెళ్ళింది రాణి ముఖర్జీ. ఆమె వెళ్ళింతర్వాత, అక్కడున్న విలేఖరులు "ఈరోజు రాణి మూడ్ అంత బావున్నట్లు లేదని" మిన్నకుండిపోయారట.

No comments: