Tuesday, October 30, 2007

ఇప్పుడు "పౌర్ణమి" వంతు







తమిళనాట తెలుగు చిత్రాల హంగామాలో ఇప్పుడు "పౌర్ణమి" చిత్రం వంతు వచ్చింది. గతంలో మహేశ్ బాబు నటించిన "అతడు", "సైనికుడు" మొదలుకొని నిన్న మొన్నటి నాగార్జున "బాస్" దాకా తమిళనాట స్వైర విహారం చేసినవే. ఇక నాగార్జున "బాస్" తమిళ చిత్రాలకు పోటీగా ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతూనే ఉంది. ఇప్పుడు ప్రభాస్, త్రిశ,ఛార్మి లు నటించిన "పౌర్ణమి" చిత్రం తమిళనాట విడుదలకాబోతోంది. దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఇప్పటికే జెనీలియా, నితిన్ ల "సై" "ఖగజు" పరుతో రిలీజ్ కు రెడీగా ఉండగా, మరో వైపు వెంకటేశ్ , నయనతార నటించిన "తులసి" కూడా త్వరలో తమిళంలో విడుదలకానుంది. ఈ లెక్కన తమిళనాట తెలుగు చిత్రాల జోరు కొనసాగుతున్నట్లే కదా!

No comments: