Saturday, October 27, 2007

అమితాబ్, అభిషేక్ సహా ముప్పై ఒక్క టాప్ స్టార్లు నటించిన షారుఖ్ "ఓం శాంతి ఓం"

ఇది నిజంగా హిందీ సినీ అభిమానులకు మంచి వార్తే. ఒకే చిత్రంలో తాము అభిమానించే ముప్పై ఒక్క మంది టాప్ స్టార్లు దర్శనం ఇవ్వడం నిజంగా అభిమానులకు కనులపండుగే మరి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించి, నిర్మిస్తూన్న "ఓం శాంతి ఓం" చిత్రంలో ఒకేసారి పెద్ద స్టార్లు దర్శనమివ్వనున్నారు. అమితాబ్ బచ్చన్, అభ్షేక్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర, మిథున్ చక్రవర్తి సహా పాత, కొత్త అగ్ర తారాగణం కనిపించనుంది. మిగిలిన వారి పేర్లు రహస్యంగా ఉంచుతున్నప్పటికీ, చిత్రంలోని ఒక ప్రధాన పాటలో వీరంతా దర్శనం ఇవ్వనున్నారు. ఇక అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లు పాటకన్నా ముందునుంచే చిన్న పాత్రలో కనిపించనున్నారు. దీపావళికి విడుదలవనున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం విడుదలై ఎన్ని రికార్డులు సాధిస్తుందో చూద్దాం.

No comments: