Wednesday, October 24, 2007

జాతీయ జెండాకు అగౌరవం :అమీర్‌ఖాన్‌ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్


జాతీయ పతాకాన్ని అగౌరవ పరచిన వ్యవహారంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్‌ఖాన్‌కు ఇండోర్ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. గత ఆగస్టు నెల 16వ తేదీన ప్రముఖ పారిశ్రామికవేత్త అశోక్ రాజ్‌పాల్, రాకేష్ రాజ్‌పాల్‌లకు చెందిన కార్ల షో రూమ్ ప్రారంభోత్సవానికి ఈ బాలీవుడ్ నటుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మొత్తం 11 దేశాలకు చెందిన జాతీయ పతాకాలను ఎగురవేశారు. అయితే సూర్యాస్తమయం తర్వాత కూడా త్రివర్ణ పతాకాన్ని అవనతం చేయలేదు. అంతేకాకుండా, షోరూమ్‌లో పని చేసే సిబ్బంది కొంతమంది ఆ పతాకాలను తొలగించి కింద పడేసినట్టు ఆ కార్యక్రమానికి హాజరైన కొన్ని మీడియాలు వార్తా కథనాలను ప్రచురించాయి. దీనిపై న్యాయవాది శైలేంద్ర శర్మ దాఖలు చేసిన పిటీషన్ మేరకు ఇండోర్ న్యాయస్థానం అమీర్‌ఖాన్‌కు వ్యతిరేకంగా బెయిలు పొందే అవకాశంలేని అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది.

No comments: