Thursday, October 18, 2007

నాన్న ఒప్పుకోడు, మావయ్య జరుగనివ్వడు- అందుకే ఈ "ప్యూహాత్మక వివాహం" ...


చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహాన్ని చాలా ప్యూహాత్మకంగా జరుపుకుని చిరంజీవి కుటుంబీకులతోబాటు, మొత్తం చిరంజీవి అభిమానులను, ఆంధ్ర ప్రజానీకాన్ని విస్మయానికి గురి చేసింది. అయితే ఇంత ప్యూహాత్మకంగా వ్యవహరించడం వెనక చాలా రోజులపాటు తను మానసికంగా ఆవేదన చెందిందని తెలిసింది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత విశయంలో కూడా పెద్దవారు అడ్డుతగిలి వారి వివాహం జరగకుండా అడ్డుకున్నారని, అలాగే తన ప్రేమ విశయంలోనూ జరిగే అవకాశం ఉందని భావించిన శ్రీయ ఇంతటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు టాలీవుడ్ సమాచారం. నిజానికి చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత్ వర్ధమాన నటుడు ఉదయకిరణ్ ను ప్రేమించింది. ఆ విశయం ముందుగా తెలుసుకున్న చిరంజీవి కొద్ది పాటి వ్యతిరేకతతో ఒప్పుకున్నా, ఆతర్వాత తన మావయ్య అల్లు అరవింద్ చేసిన మంత్రాంగం వల్ల ఆ వివాహాన్ని నిశ్చితార్థం తర్వాత జరగకుండా అడ్డుకున్నారని, అలాగే తన వివాహాన్నీ అడ్డుకుంటారని భావించిన శ్రీయ పెద్దలకు తెలీకుండా తన వివాహాన్ని జరుపుకుంది. అయితే ఈ ప్రేమ వ్యవహారాన్ని దాదాపు రెండు సంవత్సరాలకు పూర్వమే తమ పెద్దలకు తెలియడంతో అప్పుడే వారు గట్టిగా మందలించడంతో తమపెళ్ళీ జరుగనివ్వరని భావించిన శ్రీయ తన ప్రేమికుడు శిరీష్ హరద్వాజ్ తో అప్పట్లోనే తమవివాహం బయటే జరుగుతుందని చెప్పేదని, అలాగే బయట మితృలతో కలిసి తన వివాహాన్ని జరుపుకుంది. నిజానికి చిరంజీవి తన కుటుంబం పట్ల చాలా ప్రేమగా వ్యవహరిస్తారని, కూతుర్లను, కొడుకును చాలా ప్రేమగా పలకరిస్తారనీ, అయితే తమ కుటుంబ వ్యవహారాలలో, ఇతర విశయాలలో అల్లు అరవింద్ చెప్పిందే వింటాడనీ, అల్లు అరవింద్ కు చిరంజీవి కూతుర్లు ప్రేమ వివాహాలు కాకుండా పెద్దలు నిర్ణయించిన వివాహాలు చేసుకుంటేనే ఆయనకు గౌరవమణి భావిస్తారని, అందుకు తగ్గట్లే వ్యవహరించి తన ప్రేమ వ్యవహారాన్నీ సాగదీస్తూ వస్తున్నాడనీ, అలాగే లోలోన తనకు వేరే సంబంధాలు కూడా చూసినా చూస్తారని భావించిన శ్రీయ గత మూడు నేలలకు పూర్వమే తమ వివాహాన్ని రిజిస్టర్ ఆఫీసులో చేసుకోవాలని భావించిందని, అది ఎలాగో తెలుసుకున్న తన అన్న రాం చరన్ తేజ శిరీష్ భరద్వాజ్ ను హెచ్చరించడం జరిగిందని, అలాగే అప్పటి నుంచి తనను బయటికి కూడా వెళ్ళకుండా తన పెద్ద వారు కట్టడి చేయడంతో గత వినాయక చవితికి తన మితృరాళ్ళతో, శిరీష్ భరద్వాజ్ తో కలిసి తన పెళ్ళికి ప్యూహాన్ని రచించడం జరిగిందని, అప్పటినుంచీ శ్రీయ మరింత జాగ్రత్తతో వ్యవహరిస్తూ వస్తున్నా, గత నాలుగు రోజులుగా తమ పెద్ద వారికి తామేదో చేయబోతున్నామనె అనుమానం వచ్చి మరింత కట్టడి చేశారనీ, దాంతో శ్రీయ తన మితృరాలి పుట్టినరోజు నాటకం ఆడి ఇంట్లోచి బయటపడి నేరుగా తన ప్రేమికుడు శిరీష్ భరద్వాజ్ ను కలుసుకుని ముందుగా తాము చేసుకున్న ఏర్పాట్ల ప్రకారం బోయిన్ పల్లిలోని ఆర్య సమాజ్ లో తన వివాహాన్ని చేసుకుంది. దీనికి తనకు అత్యంత ఆప్తులైన మితృలను తప్ప వేరే మరెవరికీ తెలియకుండా జాగ్రత్తపడి తన ప్రేమను పెళ్ళితో ముగించిందని టాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఒకటి, ఈ ప్రేమ వివాహం వల్ల చిరంజీవి, అతని కుటుంబీకులు,యావత్ చిరంజీవి అభిమానులు మొత్తం తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.

No comments: