Saturday, October 13, 2007

జోరుమీదున్న నయనతార, తమిళ శింబుల ప్రేమాయణం




"నేను పత్రికలవారితో మాట్లాడను", "నేను పబ్లిక్ ఫంక్షన్లలో పాల్గోను","నేను ఎలాంటి అధికారికమైన కార్యక్రమాలకు రాను","సినిమాలో నటించడం వరకే నా పని, ఆ తర్వాత మీ తిప్పలేవో మీరే పడండి" లాంటి కొత్త కొత్త కండీషన్లన్నీ వెతికి మరీ పెడుతున్న తెలుగు, తమిళ, మళయాల చిత్రాల కథానాయకి నయనతార అసలు కథ తమిళనాట వాడ వాడలా తెలిసిపోయింది. నటి నయనతార, తమిళ నటుడు శింబుల ప్రేమాయణం ఇప్పుడు తమిళనాడులో దాదాపు అందరికీ తెలిసిపోయింది. తమ మధ్యన ఉన్న ప్రేమాయణాన్ని గిచ్చి గిచ్చి మరీ అడుగుతారనే నెపంతోనే పత్రికా విలేఖరులు, టి వి రిపొర్టర్లకు కనిపించని నయనతార నటుడు శింబుతో పూర్తిగా ప్రేమలో మునిగి పోయింది. అయితే మునిగితే మునగనీ కానీ, ఇలా ఫోటోలు దిగడం మాత్రం ఏమీ బాగాలేదని ఇరు పక్షాల పెద్దలు ఇద్దర్నీ పిలిచి మరీ చెడామడా తిట్టిపడేశారనీ, దాంతో ఇకపై బయట కలుసుకునేది లేదని ఇద్దరు ప్రేమికులూ నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇంత జరిగినా ఇరు పక్కలా ఎవరి నుంచీ పెళ్ళి ప్రస్తావన రాలేదని తమిళనాడులో ఒకటే పుకారు. దీని వెనక మంచి డిమాండ్ లో ఉన్న వీరికి పెళ్ళి జరిగితే వారి మార్కెట్ దెబ్బ తింటుందని ఆలోచనా, లేక రహస్యంగా ఆ మూడు ముళ్ళూ వేసేసి కొన్నాళ్ళు రహస్య కాపురం పెట్టించే ఆలోచనా. ఏదీ ఇదమిద్దంగా తెలీకున్నా, ఇప్పుడు నయనతార, శింబులు మాత్రం పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని మాత్రం అర్థమై పోయింది. సరే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించి, త్వరలోనే ఆ వార్త ప్రేక్షకుల చెవిన వేస్తారని ఆశిద్దాం.

No comments: