Wednesday, October 31, 2007

గిన్నిస్ బుక్ రికార్డుకోసం అధికారికంగా పరిశీలిస్తున్న విక్రం "మల్లన్న" స్పెషల్ ట్రైలర్

video

ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న "హ్యాప్పీడేస్" ట్రైలర్

video

శేఖర్ కపూర్‌కు అంతర్జాతీయ గౌరవం



ప్రముఖ్ సినిమా రూపకర్త శేఖర్ కపూర్‌కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. టర్కీలోని అంటాల్యాలో ఆదివారం ప్రారంభమైన మూడవ అంతర్జాతీయ యూరాసియా చలనచిత్రోత్సవంలో శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన "ఎలిజబెత్: ది గోల్డెన్ ఏజ్" చిత్రం ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమయ్యింది. ఆ విధంగా సినిమా రంగానికి శేఖర్ కపూర్ అందించిన సేవలకు ప్రత్యేక గౌరవాన్ని చిత్రోత్సవం అందించింది. ఈ సందర్భంగా శేఖర్ కపూర్ ప్రసంగిస్తూ టర్కీ దేశం ఐరోపా, ఆసియా ఖండాల మధ్య సాంస్కృతిక వారధిగా నిలుస్తున్నదని అన్నారు. తద్వారా ప్రాచ్య దేశాల స్థానానికి చేరుకునేందుకు టర్కీ భౌగోళిక పరిస్థితులు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. "మౌసమ్", "మిస్టర్ ఇండియా" మరియు "బాండీట్ క్వీన్" హిందీ చిత్రాల ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దర్శకునిగా తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని శేఖర్ కపూర్ సంపాదించుకున్నారు.

"ఐ లవ్ న్యూయార్క్" అంటూ ర్యాంప్ పై నడిచిన నటి స్నేహ


తెలుగు, తమిళ నటి స్నేహ ఒక ఫ్యాషన్ షోలో ర్యాంప్ పై నడిచింది. ప్రముఖ డిజైనర్ సిడ్నీ ఎస్.స్లాడెన్ రూపొందించిన దివాలీ స్పెషల్ కలెక్షన్స్ "ఐ లవ్ న్యూయార్క్" ర్యాంప్ లో ఆమె పాల్గొని ఆహూతులను అలరించింది. సిడ్నీ ఎస్ స్లాడెన్ కోలీవుడ్ లో ప్రముఖ డిజైనర్ గా పేర్గాంచాడు. "చంద్రముఖి" చిత్రంలో అతను రజినీకాంత్ డ్రెస్ డిజైనింగ్ చేశారు.

ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్"(31/10/2007)


(గమనిక : ముందుగా సినిమా పేరు, వెంటనే ఆయా చిత్రానికి రెడ్ కార్పెట్ ఇచ్చిన రేటింగ్ లను చూడగలరు)

American Gangstar :Rating - R
(for violence, pervasive drug content and language, nudity and sexuality)

Bee Movie : Rating - PG
(for mild suggestive humor)
Darfur Now : Rating - PG
(for thematic material involving crimes against humanity)

Martian Child : Rating - PG
(for thematic elements and mild language)

RATINGS GUIDE
G : GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children) PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
శ్రీవెంకట్ బులెమోని

అమెరికా విమర్షకులను మెప్పించిన "బీ మూవీ" ఎక్స్ క్లూజివ్ వీడియో క్లిప్పింగ్

video

ప్రతిష్టాత్మక యానిమేషన్ చిత్రం "బీ మూవీ" నవంబర్ 2న అమెరికాలో విడుదలవనుంది. చిన్నారులను అలరించడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ చిత్రం అమెరికా విమర్షకుల అభినందనలు సహితం పొందింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి చెందిన ప్రత్యేకమైన వీడియో క్లిప్పింగ్ ను ఇక్కడ ఇస్తున్నాము. వీక్షించండి.

సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన మరో ప్రేమకావ్యం "సావరియా" (స్పెషల్ ట్రైలర్ మీకోసం)

video

చిన్నారులను అలరించనున్న మరో యానిమేషన్ చిత్రం"బీ మూవీ" (గ్యాలరీ)







Tuesday, October 30, 2007

విక్రం, శ్రీయ నటించిన "భీమ" చిత్రం లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
















ఒక మంచి పని కోసం "ఓం శాంతి ఓం"-స్పెషల్ షో


"కరుణై" ఒక స్పెషల్ స్కూల్. శారీరకంగా, మానసికంగా పూర్తి స్థాయిలో అభివృద్ది చెందని విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాల అది. విధి వంచితులైన ఆ చిన్నారులకోసం "పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్" తనవంతు కృషి చయడం కోసం ముందుకు వచ్చింది. దక్షిణ భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలలో 371 థియేటర్లు గల ఈ సంస్థ "సొరాప్టొమిస్ట్ డౌన్ టౌన్" స్వచ్చంద సంస్థతో కలిసి ఈ "కరుణై" పాఠశాలలో చదివే విద్యార్థుల సహాయానికై బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం "ఓం శాంతి ఓం" చిత్రం విడుదలకన్నా ముందే ప్రత్యేక షో వేస్తోంది. చెన్నైలోని సత్యం కాంప్లెక్స్ లో నవంబర్ 7వ తేదీన, సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రదర్షించే ఈ ప్రత్యేక షో వల్ల వచ్చే మొత్తాన్ని "కరుణై" పాఠశాలలోని విద్యార్థుల కోసం వినియోగించనున్నారు. కనుక ఆసక్తి పరులు ఈ ప్రత్యేక చిత్ర ప్రదర్శణలో చిత్రాన్ని చూసి, ఆ చిన్నారులకు తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. ఇతర వివరాలకోసం 9840106498 లేదా 9841003037 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

మరో కమనీయ ప్రేమ కావ్యం "సావరియా" (వాల్ పేపర్స్)




"ప్రేమ"లో గెలిచి "కుటుంబాన్ని" ఓడిపోయిన శ్రీజ



టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ "ప్రేమ" లో గెలిచింది. ఏ మేరలో గెలిచిందంటే దేశ రాజధాని ఢిల్లీ స్థాయిలో గెలిచి తను ప్రేమ విజేతనని జగతికి చాటింది.ఇది ఒక విధంగా అభినందించదగ్గ విషయమే. అయితే ఏక కాలలో అదే ప్రేమకోసం మరి కొన్ని హృదయాల్లోని స్వచ్చమైన ప్రేమను కోల్పోయింది.
స్వచ్చమైన అని ప్రత్యేకంగా చెప్పడం వెనుక "శ్రీజ శిరీష్ భరద్వాజ్" లది స్వచ్చమైన ప్రేమ కాదని అనడం లేదు. అది స్వచ్చమైనదా, లేక ఉడుకు రక్తంతో చేసినదా, లేక మరేదైనా కారణం వల్ల జరిగిందా అనేది కాలం తప్పకుండా చెబుతుంది. అయితే ఆ కాలం తీర్పు వినాలంటే మరి కొన్నాళ్ళు గడవాలి. కనుక స్థూలంగా చెప్పేదేమిటంటే శిరీష్ భరద్వాజ్ పేమను గెలుచుకున్న శ్రీజ, తన అమ్మా, నాన్న, తోబుట్టువు, అన్నయ్య, బాబాయ్...ఇలా ఎంతో మంది ప్రేమను కోల్పోయింది. అంటే శ్రీజ "ప్రేమ" లో గెలిచినట్లా, లేక "ఓడినట్లా" ఒక్కసారి ఆలోచించండి.మొదటి తప్పు కన్నా, రెండవ తప్పే చిరు కుటుంబాన్ని ఎక్కువ బాధించింది.ఇది నిజం. శ్రీజ పెద్దల ప్రమేయం లేకుండా తను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ ను పెళ్ళి చేసుకోవడం వల్ల చిరు కుటుంబం కొంత బాధ పడిన విషయం అందరికీ తెలుసు. అయితే తదనంతరం ఆమె, తన భర్తతో కలిసి ఢిల్లీ కోర్టుకు ఎక్కి చిరు కుటుంబం వల్ల, చిరు అభిమానుల వల్ల తనకు, తన భర్తకు రక్షన కలిగించాలని కోరడం ఒక ఎత్తయితే, చిరంజీవి అధికారికంగా శ్రీజ లాయర్ పింకీకి లెటర్ వ్రాసిన తరువాత కూడా మీడియాలో కనిపించిన ప్రతిసారీ "అతని అభిమానుల వల్ల తన భర్తకు ముప్పు" అనో, లేక "తమను అధికారిక లాంచనాలతో రిసీవ్ చేసుకుని, గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి, తన అత్తవారింటికి పంపించాలని" చెప్పడం, లేదా "అతని అభిమానులకు తను చెప్పేదాకా మాకు రక్షణ కరువు" అనో, ఇంకొన్ని మార్లు "అతను మొండివాడయితే, నేను జగమొండిని" ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడి తనవారిని మానసికంగా బాధపడేలా చేసింది. దాని పర్యవసానం...చివరికి చిరు కుటుంబం శ్రీజతో మాట్లాడటానికి కూడా సుముఖత చూపకపోవడమే. ఈ బాధనుంచి కొన్నాళ్ళు దూరంగా ఉండటంకోసం ఏకంగా కుటుంబ సమేతంగా అమెరికా వెళ్ళడానికి సమాయత్తమయ్యారంటే వారు మానసికంగా ఎంత బాధ పడినట్లు. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమేనా?
అంటే శ్రీజ గెలిచిన ప్రేమకోసం కోల్పోయిందేమిటి?
కోల్పోయిన కన్న ప్రేమను తను తిరిగి పొందుతుందా?
పోనీ కొన్నాళ్ళయితే అంతా మరుగున పడుతుందనుకుంటే, మానసికంగా పడ్డ క్షోభ ఆ బాధను మరువనిస్తుందా? చివరికి శ్రీజకు ఎప్పటికైనా కన్నవాళ్ళు తిరిగి దక్కుతారా? ఒకప్పటి ప్రేమతో చేరదీస్తారా?
....వీటన్ని ప్రష్నలకూ దొరికే ఒకే ఒక సమాధానం
"శ్రీజ ప్రేమ"లో గెలిచి "కుటుంబాన్ని" ఓడిపోయిందనేదే.

శ్రీజ ఇంటర్వ్యూలు చూడలేక అమెరికాకు వెళ్ళిన చిరు కుటుంబం?




టెలివిజన్ చానళ్లలో శ్రీజ ఇంటర్వ్యూలు చూసిచూసి కుమిలిపోయిన చిరంజీవి కుటుంబం అమెరికాకు వెళ్లినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. దీనికితోడు తన తండ్రి చిరంజీవి తమను ఆదరించి రిసెప్షన్ ఇవ్వాలని, ఆయన అభిమానులు తమపై దాడి చేసే అవకాశం ఉంది కనుక ఆయన తన అభిమానులకు "మేము కలిసిపోయామనే సందేశాన్ని, అధికారిక విలేఖరుల ఇంటర్వ్యూలో చెప్పాలని" శ్రీజ టీవీలో కనపడినపుడల్లా కోరుతుండడంతో చిరంజీవి కుటుంబంలోని వారిని మరింత బాధను కలిగించిందని అందుకే కొన్నాళ్లు హైదరాబాద్ కు దూరంగా ఉండాలని వారు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

కన్నడ నుంచి డబ్బింగ్ అవుతున్న"మొగుడు పెళ్ళాం ఓ బాయ్‌ఫ్రెండ్"

పెళ్ళయిన తరువాత జీవితంలోకి బాయ్ ఫ్రెండ్ ప్రవేశిస్తే ఆ భార్య పయనమెటు? బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి భర్తను మోసం చేస్తే భర్త ఆ భార్యను ఏం చేస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే "మొగుడు పెళ్ళాం ఓ బాయ్‌ఫ్రెండ్" అని నిర్మాతలు వల్లభనేని వెంకటేశ్వరరావు, గుత్తికొండ మురళీమోహన్ చెబుతున్నారు. కన్నడలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తెలుగులోకి దివ్యసాయి పిక్చర్స్ పతాకంపై అందిస్తున్నారు. రవి శ్రీ వాస్తవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. భర్తగా విశాల్, భార్యగా సంజన, బాయ్‌ఫ్రెండ్‌గా తిలక్ నటించారు. సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వల్లభనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ "ఇప్పటికే ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందన్నారు. నవంబర్ రెండో వారంలో సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. బ్యాంకాక్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన లొకేషన్ల నడుమ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శృంగారం, సెంటిమెంట్ కలిసిన కుటుంబకథా చిత్రమిదని వల్లభనేని తెలిపారు.ఈ చిత్రంలో నాలుగు పాటలున్నాయని, గురుకిరణ్ సమకూర్చిన సంగీతం శ్రోతలను అలరిస్తుందని, త్వరలో ఆడియోను విడుదల చేస్తామని" అన్నారు.

మహేశ్ బాబు హీరోగా జేంస్ బాండ్ సిరీస్...!?




టాలీవుడ్ యంగ్ హీరో ప్రిన్స్ మహేశ్ బాబు త్వరలో జేంస్ బాండ్ గెటప్ లో దర్శనమివ్వనున్నట్లు టాలీవుడ్ సమాచారం. హాలీవుడ్ హాటెస్ట్ ఫిలిం సిరీస్ అయిన జేంస్ బాండ్ తెలుగులో కూడా కొనసాగడం కోసం ముందస్తు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నట్లు వినికిడి. గతంలో అంటే 1970వ దశకంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు, ఏజెంట్ గోపి-116 తదితర చిత్రాలు ఈ తరహాకు చెందినవే. వాటిని అప్పటి ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. ఇప్పుడు వాటికి కొనసాగింపుగా మహేశ్ బాబు తో జేంస్ బాండ్ తరహా చిత్రాలను నిర్మించడం కోసం "అతిధి" దర్శకుడు సురేంద్ర సమాయత్తమౌతున్నట్లు తెలిసింది. ప్రాధమికంగా దీనికి సంబంధించిన స్టోరీ లైన్ కూడా తయారు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ప్రయత్నం పట్ల మహేశ్ బాబు కూడా ఉత్సాహం చూయించడంతో బాటు, ఈ సిరీస్ ను ఏదైనా కార్పోరేట్ కంపనీ సహకారం తో లేదా, కార్పోరేట్ కంపనీ నిర్మాణంలో నిర్మించాలని అనుకుంటున్నటు తెలిసింది. అందుకు ప్రారంభంగా కథ, కథనాలను తయారు చేసుకోమని సురేంద్రకు మహేశ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు టాలీవుడ్ లో స్ట్రాంగ్ గానే వినిపిస్తోంది. చూద్దాం. ఈ ప్రయత్నం ఎంతవరకు వస్తుందో.

ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ క్యారికేచర్స్ (క్యారికేచర్ గ్యాలరీ)






ఇప్పుడు "పౌర్ణమి" వంతు







తమిళనాట తెలుగు చిత్రాల హంగామాలో ఇప్పుడు "పౌర్ణమి" చిత్రం వంతు వచ్చింది. గతంలో మహేశ్ బాబు నటించిన "అతడు", "సైనికుడు" మొదలుకొని నిన్న మొన్నటి నాగార్జున "బాస్" దాకా తమిళనాట స్వైర విహారం చేసినవే. ఇక నాగార్జున "బాస్" తమిళ చిత్రాలకు పోటీగా ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతూనే ఉంది. ఇప్పుడు ప్రభాస్, త్రిశ,ఛార్మి లు నటించిన "పౌర్ణమి" చిత్రం తమిళనాట విడుదలకాబోతోంది. దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఇప్పటికే జెనీలియా, నితిన్ ల "సై" "ఖగజు" పరుతో రిలీజ్ కు రెడీగా ఉండగా, మరో వైపు వెంకటేశ్ , నయనతార నటించిన "తులసి" కూడా త్వరలో తమిళంలో విడుదలకానుంది. ఈ లెక్కన తమిళనాట తెలుగు చిత్రాల జోరు కొనసాగుతున్నట్లే కదా!

ముప్పై నిమిషాలలో ఆరు పాటలకు ట్యూన్స్ ఇచ్చిన ఇళయరాజా


మ్యూజిక్ మ్యేస్ట్రో ఇళయరాజాకు పరిచయం అక్కరలేదు. ఆబాలగోపాలాన్ని తన సంగీత స్వరాలతో ఓలలాడించిన ఈ సంగీత సామ్రాట్టు ఓ కొత్త రికార్డును సృష్టించాడు. ఇళయరాజాతో సహా ఎవరైనా సంగీత దర్శకుడు సాధారణంగా తమ పాటలకు ట్యూన్స్ కట్టడానికి కొన్ని రోజుల సమయం తీసుకుంటారు. ఒక్కో పాటకు కొన్ని రోజుల చొప్పున సినిమాలో ఉండే ఆరు పాటలకు సుమారుగా ఒక నెల రోజులనుంచి, నెలన్నరదాకా తీసుకున్న సందర్భాలూ ఉంటాయి. అయితే మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలో ఆరు పాటలకు వీనులవిందైన ట్యూన్స్ ను అందించి దర్శక,నిర్మాతలతోబాటు సినీ పరిశ్రమనూ విస్మయానికి గురిచేశారు. ప్రముఖ దర్శకుడు పి వాసు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన చంద్రనాథ్ తస్న తొలి చిత్రానికి ఇళయరాజాతో సంగీతాన్ని సమకూర్చుకోవాలని భావించాడు. తన మనసులోని ఆలోచన, చిత్ర నేపద్యం ఇళయరాజాకు చెప్పి ఇంటికి వెల్లేలోగా ఇళయరాజా నుంచి చంద్రనాథ్ కు పిలుపు వచ్చింది. అంతలోనే పిలిచాడంటే మరేదైనా సందేహమేమో అని భావించిన తనకూడా ఉన్న నిర్మాతతో సహా ఇళయరాజా ఇంటికి వెళ్ళగా, ఇళాయరాజా ఏకంగా తమ చిత్ర ట్యూన్స్ వినమంటూ, వినిపించేసరికి ఆ దర్శక,నిర్మాతలకు నోట మాట రాలేదని తెలిసింది. వీనులవిందైన ఆ పాటలు విని వెంటనే సాష్టాంగపడటం దర్శకుని వంతైందని సమాచారం. ఇళయరాజానా...మజాకా...!

వానొచ్చి జోరుపెరిగిన "మల్లన్న"


వర్షం వచ్చి చెన్నైలో ఎన్నో షూటింగ్ లకు అంతరాయం కలిగింది. కానీ విక్రం, శ్రియ జంటగా నటిస్తున్న ద్విభాషా చిత్రం "మల్లన్న" మాత్రం వర్షంతో మరింత జోరందుకుంది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న "మల్లన్న" చిత్ర దర్శకుడు చెన్నైలోని బీచులో ఏకబిగిన వర్షంలోనే తన చిత్రీకరణను గావించాడు. దాంతో నిర్మాతకు కృత్రిమంగా వేయాల్సిన సెట్టు ఖర్చులు, కృత్రిమ వర్షం ఖర్చు మిగిలిపోయింది. రాబిన్ హుడ్ తరహా పాత్రలో విక్రం నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీయ కూడా విభిన్న తరహా పాత్రను పోశిస్తోంది. చెన్నై సముద్ర తీరం, బీచు పరిసర ప్రాంతాలు, మహాబలిపురం రోడ్డు తదితర పలు ప్రాంతాలలో ఈ షూటింగ్ ను కొనసాగించారు. మరో 15 రోజులపాటు ఇక్కడ చిత్రీకరణ జరిగిన తరువాత మొత్తం యూనిట్ కెన్యా, ఇటలీ లకు తరలి వెలుతుంది. వచ్చే ఏప్రిల్ 14వ తేదీన ఈ చిత్రాన్ని విడుదలచేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు తెలిసింది.

"జల్సా"గా విక్రం "భీమ" ఆడియో విడుదల చేసిన పవన్ కళ్యాణ్




మరో రాబిన్ హుడ్ "మల్లన్న":రియల్లీ వండర్ ఫుల్ (ఎక్స్ క్లూజివ్ ఫోటో గ్యాలరీ)








Monday, October 29, 2007

మా నాన్న మొండి అయితే, నేను జగమొండిని : మీడియాతో శ్రీజ


నాదంతా మా నాన్న పోలిక అంటారు. మా నాన్న మొండి అయితే నేను జగమొండిని. ఏవిషయమైన నేను ఇంతే. మామ్మా నాన్నలు పిలిచేదాకా నేను మా ఇంటికి వెళ్ళదలచుకోలేదని శ్రీజ ఢిల్లీలో పేర్కొంది. ఈ రోజు ఉదయం నుంచి మీడియాతో పలు దఫాలుగా మాట్లాడిన శ్రీజ పలు అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఎవరెంత చెప్పినా శిరీష్ భరద్వాజ్ కు ఇంకా ప్రమాదం పొంచి ఉందని నాకు అనిపిస్తోందని, ఈ విషయంలో మా నాన్న తన అభిమానులకు "మేము కలిసి పోయాము, నా కూతురిని, అల్లుడిని ఏమీ చేయవద్దని మీడియా ముఖంగా చెబితేగానీ, మేము పూర్తి నమ్మకంతో ముందుకు సాగలేమని, ప్రస్తుతానికి మరికొన్ని రోజులు ఢిల్లీ నుంచి హైదరాబాదుకు రాదలచుకోలేదని శ్రీజ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వచ్చినా నేను ఖచ్చితంగా మా ఇంటికి వెళ్ళనని, మా కుటుంబీకులనుంచి అధికారికమైన ఆహ్వానం అందితేనే నేను మా ఇంటికి వెళతానని, ఈ విషయంలో మా నాన్నకన్నా మొండిగా వ్యవహరించదలచినట్లు శ్రీజ మీడియాకు చెప్పింది.

రాం,జెనీలియాల "రెడీ" దేనికైనా ...

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్, జెనీలియా జంటగా రూపొందుతున్న సినిమాకు టైటిల్ ను ఖరారు చేశారు. శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమాకు "రెడీ" టైటిల్ను, "దేనికైనా" అనేది టాగ్ లైన్ గా పెట్టారు. ఈ సినిమాను స్రవంతి రవికోషోర్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం ఒక పాటను వైజాగ్ లో చిత్రీకరించనున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

తారక్ "వెంకటాద్రి" చిత్రంలో ఫైటింగ్స్ సంథింగ్ స్పెషల్ అంటున్నారు (గ్యాలరీ)





హాలీవుడ్ "లవ్ డాక్టర్" = పవన్ కళ్యాణ్ "జల్సా"




పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలు అరవింద్, గీతా ఆర్ట్స్ బ్యానరుపై నిర్మిస్తున్న "జల్సా" చిత్రం హాలీవుడ్ "లవ్ డాక్టర్" చిత్రానికి ప్రీమేక్ అని టాలీవుడ్ సమాచారం. "ఖుషి" చిత్రం తర్వాత ఆతరహా ప్రేమ కథలో పవన్ నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని ట్రేడ్ మార్కెట్ అభిప్రాయంగా వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబధించి కేవల మూడు పాటలు, మూడు ఫైట్లు, మరో అయిదు రోజుల టాకీ తప్ప మిగిలిన షూటింగ్ మొత్తం పూతయిందని, చిత్రంలోని పాటలు బాగా వచ్చాయని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి ంపర్వదినోత్సవం సందర్బంగా జనవరి 14వ తేదీన విడుదలచేయడానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు తెలిసింది.

కామన్ మెన్ ప్రొటెక్షన్ అంటే ఏమిటో పవన్ కళ్యాణ్ అర్థం చెప్పాలి-విలాసిని


కామన్ మెన్ ప్రొటెక్షన్ పేరుతో పవన్ కళ్యాణ్ డ్రామా ఆడుతున్నారని, అసలు ఆయనకు దీని పట్ల ఏమాత్రం చిత్త శుద్ది లేదని విలాసిని ఆరోపించారు. ఆయనవి వుత్తుత్తి మాటలే తప్ప చేతల్లొకి రాని ప్రగల్బాలని ఆమె తీవ్రంగా విమర్శించారు.

పిసిసి మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు కుమారుడు వెంకట్ ఇంట్లో కాల్పుల్లో మరణించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి భార్య విలాసినికి సహాయం అందించడానికి సినీ నటుడు పవన్ కళ్యాణ్ నిరాకరించారు. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సియంపిఎఫ్) వ్యక్తిగత సమస్యలను పట్టించుకోదని పవన్ విలాసినికి సమాచారం అందించారు. విలాసిని ఆయన కలవలేదు. పవన్ కళ్యాణ్ షూటింగులో ఉన్నారని, ఇప్పుడు కలవడానికి వీలు కాదని ఆమెకు సమాచారం వచ్చింది. వ్యక్తిగత సమస్యలు పట్టించుకోమని చెబుతున్న పవన్ కళ్యాణ్ కామన్ మెన్ ప్రొటెక్షన్ అంటే అర్థమేమిటో చెప్పాలని విలాసిని అడిగారు. సియంపిఎఫ్ ద్వారా సాధారణ వ్యక్తులకు సహాయం చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారని, తనకు న్యాయం జరిగేందుకు తోడ్పడాలని కోరడానికి ఒక సాధారణ వ్యక్తిగా వచ్చానని ఆమె అన్నారు.

"శ్రీ" జంటకు మరో రెండు వారాల పోలీసు రక్షణ : కోర్టు తీర్పు


చిరంజీవి చిన్న కూతురు శ్రీజను వివాహం చేసుకున్న శిరీష్ భరద్వాజ్ కు, శ్రీజకు మరో రెండు వారాల పాటు పోలీసు రక్షణను పొడింగించ వలసిందిగా ఢిలీ హై కోర్టు ఈ రోజు పోలీసులను ఆదేశించింది. చిరంజీవి తన న్యా వాది ద్వారా తాము శ్రీజకు, ఆమె భర్త శిరీష్ భరద్వాజ్ కు ఎలాంటి హానీ తలపెట్టబోమని, అనవసరంగా చిన్న విషయాన్ని ఇంత పెద్దదిగా చేయడం, మీడియాకు ఎక్కడం తమను బాధించిందని కోర్టుకు తెలియజేశాడు. కోర్టు శిరీష్ బెదిరిపు కాల్స్ ఏమైనా వచ్చాయా అని అడిగినట్లు తెలిసింది. దానికి శిరీష్ అలాంటివేమీ లేదని, కాని తన మితృలకు మాత్రం కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయని కోర్టుకు తెలిపినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కోర్టు మరో రెండు వారాలపాటు వీరికి రక్షణను పొడిగించింది. వీరు హైదరాబాదుకు చరుకోగానే రక్షణ భాద్యతలను హైదరాబాదు పోలీసులు చూసుకోవలసిందిగా కోర్టు సూచించింది. ఈ సందర్భంగా శ్రీజ తన తల్లిదండృలను తమను మన్నించాల్సిందిగా లాయర్ పింకీ ఆనంద్ ద్వారా విజ్ఞప్తి చేయించింది. ఒకరిపై మరికరికి ఉన్న ప్రేమతో, చిన్నతనంతో చేసిన చిన్న తప్పును క్షమించవలసిందిగా శ్రీజ తన తల్లిదండృలను కోరుతున్నట్లు పింకీ తెలిపింది. చిరంజీవి తరుపు లాయర్ మాట్లాడుతూ చిరంజీవి కుటుంబం శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ల వివాహాన్ని స్వాగతిస్తోందని తెలియజేశాడు. ఒక విధంగా ఈ కేసు ఇంతటితో ముగిసినట్లేనని ఢిల్లీ మీడియా అభిప్రాయపడుతోంది.

2కోట్లకు "తులసి" ఉపగ్రహ ప్రదర్శన హక్కులు కొన్న వై ఎస్ ఆర్ తనయుడు


విక్టరీ వెంకటేశ్ నటించిన కొత్త చిత్రం "తులసి" శాటిలైట్ హక్కులను రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్నారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా పత్రికా, శాటిలైట్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. జగన్ స్థాపించనున్న జగన్ టి వి కోసం "తులసి" హక్కులను కొన్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి విశ్వశనీయంగా తెలిసింది. ఇందుకోసం రెండు కోట్లకు పైగా వెచ్చించినట్లు తెలిసింది. కాగా ఉపగ్రహ హక్కులకోసం ఇంత పెద్ద మొత్తం వెచ్చించడం తెలుగుసినీ పరిశ్రమలో ఇదే మొదటిసారి.

అభిమానులు దాచుకోదగ్గ సీనియర్ ఎన్ టి ఆర్ పెయింటింగ్స్ (ఎక్స్ క్లూజివ్ గ్యాలరీ)

ప్రముఖ పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఈశ్వర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు కు సంబందించిన పలు చిత్రాలను తన కుంచెతో కళాత్మకంగా చిత్రీకరించారు. ప్రతి ఎన్ టి ఆర్ అభిమానీ తప్పకుండా దాచుకోదగ్గ కొన్ని చిత్రాల పెయింటింగ్ లను ఇక్కడ ఇస్తున్నాము. తిలకించండి.





కమల్ హాసన్ డ్రీం ప్రాజెక్ట్ "మరుదనాయగం" (ట్రైలర్ ఖర్చు రెండు కోట్లు మాత్రమే)(వీడియో)

video

భారత దేశం గర్వించదగ్గ నటులలో ఒకరు కమల్ హాసన్. పరిచయం అక్కరలేని ఈ నటుడి కల "మరుదనాయగం" చిత్రంలో నటించాలని. అందుకోసం కొన్ని సంవత్సరాల క్రితమే కథ, కథనం సహా ట్రైలర్ని కూడా కమల్ హాసన్ రూపొందించారు. అయితే అంచనాలకు మించిన బడ్జెట్ వల్ల ఈ చిత్రం కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లోనే ఉంది. ఈ చిత్ర రమారమి ప్రస్తుత బడ్జెట్ సుమారు 500ల కోట్ల రూపాయలు. కానీ తన జీవిత చరమాంకంలోగా ఈ చిత్రం చేయాలనే స్థిర చిత్తం కమల్ హాసన్ లో ఉంది. అతని స్థిర చిత్త ఎంత బలమైనదంటే ఈ చిత్రం కోసం నిర్మించిన ట్రైలర్ కే సుమారు రెండు కోట్ల రూపాయలను ఆయన ఖర్చు పెట్టారు. మరి ఈ చిత్రాన్ని మనం చూస్తామో, లేదో తెలీదు, కానీ దీని ట్రైలర్ని మాత్రం తప్పకుండా చూడండి.

Saturday, October 27, 2007

అమితాబ్, అభిషేక్ సహా ముప్పై ఒక్క టాప్ స్టార్లు నటించిన షారుఖ్ "ఓం శాంతి ఓం"

ఇది నిజంగా హిందీ సినీ అభిమానులకు మంచి వార్తే. ఒకే చిత్రంలో తాము అభిమానించే ముప్పై ఒక్క మంది టాప్ స్టార్లు దర్శనం ఇవ్వడం నిజంగా అభిమానులకు కనులపండుగే మరి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించి, నిర్మిస్తూన్న "ఓం శాంతి ఓం" చిత్రంలో ఒకేసారి పెద్ద స్టార్లు దర్శనమివ్వనున్నారు. అమితాబ్ బచ్చన్, అభ్షేక్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర, మిథున్ చక్రవర్తి సహా పాత, కొత్త అగ్ర తారాగణం కనిపించనుంది. మిగిలిన వారి పేర్లు రహస్యంగా ఉంచుతున్నప్పటికీ, చిత్రంలోని ఒక ప్రధాన పాటలో వీరంతా దర్శనం ఇవ్వనున్నారు. ఇక అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లు పాటకన్నా ముందునుంచే చిన్న పాత్రలో కనిపించనున్నారు. దీపావళికి విడుదలవనున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం విడుదలై ఎన్ని రికార్డులు సాధిస్తుందో చూద్దాం.

పవన్ కళ్యాణ్ సి ఎం పి ఫోర్స్ కు అంబులెన్స్ డొనేట్ చేసిన అభిమానులు


పవన్ కళ్యాణ్ ప్రారంభించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సి.ఎమ్.పి.ఎఫ్)కు అభిమానుల నుంచి స్పందన రోజురోజుకు పెరుగుతోంది. వారికి తోచిన విధంగా స్పందిస్తున్నారు. కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన పవన్ కళ్యాన్ అభిమానులు కొందరు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు అంబులెన్స్ ను డొనేట్ చేశారు. అంబులెన్స్ వారి గ్రామంలో 24 గంటలను సేవలను అందిస్తుంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో వారు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు అంబులెన్స్ ను అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారిని అభినందించారు.

శ్రీజ పేరిట రూ.37 కోట్లు : ఫిలిం నగర్లో పుకార్లు


శ్రీజ పేరిట చిరంజీవి పెద్దయెత్తుననే బ్యాంకు బ్యాలెన్స్ ను ఉంచినట్టు ఫిల్మ్ నగర్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ బ్యాలెన్స్ ఏకంకా రూ.37 కోట్ల మేరకు ఉన్నట్టు సమాచారం. మేజర్ కాగానే ఆ పెద్ద మొత్తం శ్రీజాకు చెందేలా చేసినట్టు భొగట్టా. శ్రీజ మేజర్ కావడం రహస్యంగా ప్రేమ వివాహం చేసుకోవడం వెంటవెంటనే జరిగాయి. శ్రీజ పెద్ద ఆస్తిపరురాలన్నమాట. ప్రేమ జంట ఇక అదురూ బెదురూ లేకుండా జీవనాన్ని కొనసాగించవచ్చని అనుకుంటున్నారు. అయితే ఇందులో నిజమెంతో ఆ భగవంతునికే తెలియాలని రెండోమాటా వారుమాట్లాడుతుండటం ఇక్కడ గమనార్హం.

తమిళ "డాన్" ఎలా వున్నాడో చూద్దామా...!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన "డాన్" భారతీయ సినీ రంగంలో ఓ మేటి చిత్రంగా వినుతికెక్కింది. "డాన్" విజయం తర్వాత ఇదే చిత్రాన్ని అనేక మార్లు పలు భాషలలో రీమేక్ చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన "యుగంధర్" చిత్రానికి కూడా ఈదే మాతృక. గతంలో రజినీకాంత్ హీరోగా తమిళంలె నిర్మించిన దీని రీమేక్ మంచి విజయం సాధించింది. గత కొద్ది కాలం క్రితం షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ హిందీ రీమేక్ కూడా మంచి విజయాన్నే కూడగట్టుకుంది. కాగా ఇదే చిత్రాన్ని "భిల్లా" పేరుతో తమిళంలో మరో మారు రీమేక్ చేస్తున్నారు. దీనిని తెలుగులోకి కూడా అనువదించనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా కొత్తగా నిర్మిస్తున్న ఈ తమిళ "డాన్"(భిల్లా) ఎలావున్నాడో ఒకసారి చూడండి.







"గజిని" జంట "దేవా"తో మళ్ళీ మనముందుకొస్తోంది (ఫోటో గ్యాలరీ)







నటుడు అమీర్ ఖాన్ బ్లాగ్ కు విపరీతమైన డిమాoడ్




ఈ ఆధునిక రోజులలో బ్లాగింగ్ సర్వసాధారణం. అందుకు ఎవరూ అతీతులు కాదు. ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నిర్వహిస్తున్న వ్యక్తిగత బ్లాగ్ కు తన అభిమానులనుంచి విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఈ బ్లాగులో అమీర్ ఖాన్ తన మనసులోని రకరకాల ఆలోచనలను పొందుపరచడమే కాకుండా, తన సినిమాల విషయాలు, రాష్ట్ర, దేశ పరిస్తితులపై తన అభిప్రాయాలు బ్లాగర్లతో పంచుకుంటున్నాడు. తన మనసులోని అభిప్రాయాలను వ్యక్తం చేయడమే కాకుండా, తన అభిమానులు ఇచ్చే సూచనలను కూడా అప్పుడప్పుడు పాటిస్తున్నట్లు సమాచారం. వ్యక్తి గతంగా అమీర్ ఖాన్ బ్లాగులోకి వెల్లదలచినవారు ఈ క్రింది లింకును క్లిక్ చేస్తే చాలు.
http://www.aamirkhan.com/blog

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క "ఇష్టాఇష్టాలు"




అసలు పేరు : అనుష్కా షెట్టి
ముద్దు పేరు : మ్యాక్
గుర్తింపు లభించింది : నాగార్జున "సూపర్" చిత్రంతో
పుట్టిన రోజు : నవంబర్ 7
నేటివ్ ప్లేస్ : మంగళూరు
గ్రహ రాశి : స్కార్పియో
ఎత్తు : 5 అడుగుల, 9 అంగులాలు
జుట్టు రంగు : డార్క్ బ్రౌన్
కుటుంబం : అమ్మ, నాన్న, ఇద్దరు సోదరులు
చదువుకుంది : బి సి ఎ
హాబీస్ : కొత్త విషయాలు తెలుసుకోవడం, సంగీతాన్ని ఆస్వాదించడం
ఫెవరేట్ హీరోలు : బాలీవుడ్ లో హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్
తెలుగులో మహేశ్ బాబు ("పోకిరి" లో మరీ నచ్చుతాడు), గోపీచంద్, తారక్
ఫెవరేట్ హీరోయిన్లు : సౌందర్య, సిమ్రాన్, జ్యోతిక, కాజల్
ఇష్టమైన కారు : మై స్విప్ట్
ఇష్టమైన పుస్తకాలు : ది అల్కెమిస్ట్,త్యూస్ డేస్ విత్ మోరీ
ఇష్టమైన ఆహారం : చికెన్ తో చేసిన దేదైనా లొట్టలు వేసుకుంటూ తింటాను
ఇష్టమైన సహ నటుడు : నేను నటించిన హీరోలంతా ఇష్టమే
ఇష్టమైన డ్రెస్ : చీర కట్టుకోవడం
ఇష్టమైన రంగు : బ్లాక్ అండ్ వైట్
గ్లామర్ రహస్యం : క్రమం తప్పకుండా యోగా చేయడం (పూర్వాశ్రమంలో నేను యోగా టీచర్ నేగా మరి)

మమ్మల్ని క్షమించండి: శిరీష్ భరద్వాజ్


తాము ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని తమ రెండు కుటుంబాలను కోరుతున్నామని శిరీష్ భరద్వాజ్ కోరాడు. ఢిల్లీ కోర్టు అనుమతి లేదా, సూచనలతో వారం రోజులలోగా తాము హైదరాబాదు వెళ్ళదలచినట్లు శిరీష్ పేర్కొన్నాడు. శ్రీజతో కలిసి అతను ఢిల్లీలోని ఎపి భవన్ కు వచ్చిన సందర్భంగా అక్కడి మీడియా ప్రతినిధులతో శిరీష్ మాట్లాడాడు.మా కుటుంబ సభ్యులతో , అమ్మ, నాన్నలతో శ్రీజ మాట్లాడిందని, వారు సానుకూలంగా స్పందించారని అన్నాడు. జరిగిందేదో జరిగింది, ప్రెస్సుకు వెళ్లడం వంటి పనులు మానుకుని ఇంటికి రమ్మన్నారని అతను చెప్పాడు. రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిరితే మంచిదని అతను అన్నాడు. తమను క్షమించాలని తాము ఇది వరకే కోరామని, ఇప్పుడు కూడా కోరుతున్నామని అతను అన్నాడు. భద్రత కారణాల రీత్యా తమ కారు నెంబరు కవర్ చేసినట్లు అతను తెలిపాడు.

"బాలీవుడ్ బాద్షా" షారుఖ్ ఖాన్ కు లీగల్ నోటీసు


బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేసినందుకు గాను "బాలీవుడ్ బాద్షా" షారుఖ్ ఖాన్ కు నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఎరాడికేషన్ (ఎన్ ఒ టి ఇ) శుక్రవారం లీగల్ నోటీసు పంపింది. ఇటీవల ముంబైలో జరిగిన ట్వంట్వీ20 క్రికెట్ మ్యాచ్‌లోను మరియు ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా షారుఖ్ ఖాన్ ధూమపానం చేసినట్లు జాతీయ పొగాకు నిరోధక సంస్థ తన నోటీసులో ప్రస్తావించింది. ఇదిలా ఉండగా ఇదే సంస్థ గతంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పొగతాగుతున్న భంగిమల్లో సినిమా స్టిల్స్‌లో కనిపించినందుకుగాను అమితాబ్‌కు నోటీసు పంపింది. ఈ వివాదంపై న్యాయవిచారణ కొనసాగుతుండగానే తాజాగా షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు అదే తరహా నోటీసును పంపింది. పొగాకు నిరోధక చట్టాన్ని అనుసరించి బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం నిషేధించబడిన సంగతి తెలిసిందే. సంబంధిత చట్టం ఆసరాతో షారూఖ్ ఖాన్‌ పై న్యాయపరమైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగేందుకు ఎన్జీవో రంగం సిద్ధం చేసుకుంది.

Friday, October 26, 2007

ఉదయ కిరణ్ "వియ్యాలవారి కయ్యాలు" వాల్ పేపర్స్




టాలీవుడ్ కామెడీ అవార్డ్స్ - 2007


సికిందరాబాద్ వాకర్స్ టౌన్ ఛాప్టర్ ఆఫ్ జూనియర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆద్వర్యంలో ఉత్తమ హాస్య నటులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించనున్నారు. ఈనెల 28వ తేదీన హైదరాబాదులోని లలితకళా తోరణంలో నిర్వహించనున్న "టాలీవుడ్ కామెడీ అవార్డ్స్ - 2007" కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
కాగా ఉత్తమ హాస్య చిత్రం అవార్డుకు ఒకే చిత్రం ఎన్నికైందని నిర్వాహకులు తెలిపారు.
ఉత్తమ హాస్య చిత్రం : "యమగోల"
అవార్డు గ్రహీతలు:
1. ఉత్తమ హాస్య నటుడు : "అల్లరి" నరేశ్
2. ఉత్తమ హాస్య సహాయ నటి : హేమ
3. ఉత్తమ హాస్య సహాయ నటుడు : సునిల్
4. ఉత్తమ హాస్య కేరెక్టర్ నటి : "తెలంగాణ" శకుంతల
5. ఉత్తమ హాస్య కేరెక్టర్ నటుడు : జయప్రకాశ్ రెడ్డి
6. ఉత్తమ హాస్య విలన్ : నాజర్
7. ఉత్తమ హాస్య మాటల రచయిత : కోన వెంకట్
8. ప్రత్యేక హాస్య నటులు పురస్కారం : కృష్ణ భగాన్, రఘుబాబు.

నలభై లక్షలు తీసుకున్నాకే శ్రీజ కేసు వాదించిన పింకీ...?


సంచలనాత్మక శ్రీజ కేసును వాదించిన ప్రముఖ అడ్వకేట్ పింకీ ఆనంద్ కేసు ప్రారంభంలో తీసుకున్న మొత్తం అక్షరాల 25 లక్షలంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆతర్వాత తను కేసు పూర్వాపరాలు పరిశీలించినందుకు, వాదించినందుకు గంటకు రెండు లక్షల చొప్పున తీసుకుని శ్రీజ కేసు వాదించినట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా.ఢిల్లీలోని ప్రముఖ లాయర్ మాత్రమే కాకుండా, భారతీయ జనతా పార్టీకి లీగల్ అడ్వైజర్ గా కూడా కొనసాగుతున్న పింకీ ఆనంద్ మామూలు సమయంలో శ్రీజ దంపతులకు దర్శనం లభించడమే గగనం. బలమైన రాజకీయ వ్యక్తుల సహాయ సహకారాలతో ఢిల్లీ మజిలీకి చేరుకున్న ఈ దంపతులు పింకీ ఆనంద్ ను కలిసి హై కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలియగానే, చిరంజీవి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు వెంకయ్య నాయుడితో మాట్లాడినా, పింకీ అప్పటికే కేసును కోర్టులో వేయడం అయిపోయిందని, ప్రస్తుతం తానేమీ చేయలేనని చెప్పినట్లు తెలిసింది. జరుగుతున్న వ్యవహారాలు, శ్రీజ ధైర్యంగా మాట్లాడటం వెనుక ఎంతో బలమైన శక్తులు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని, చేతిలో అత్తెసరు డబ్బులు మాత్రమే ఉన్న శ్రీజ, శిరీష్ భరద్వాజ్ లు పింకీ ఫీజు 25 లక్షలు, మరియు కేసు వాదించినందుకౌ సుమారు 12 లక్షల డబ్బును ఎలా చెల్లించారని, అదంతా రాజకీయ అదృశ్య రాజకీయ శక్తుల ప్రోద్బలమేనని హైదరాబాద్ లో "కాంఫిడెన్షియల్ టాక్" వినిపిస్తోంది.

శ్రీజ వ్యవహారంపై చిరు కుటుంబంలో "భిన్న" స్వరాలు...!


శ్రీజ వ్యవహారం ఢిలీ కోర్టుముంగిట్లో నిలిచిన ప్రస్తుత పరిస్థితిలో ఈ వ్యవహారంపై భవిష్యత్తులో ఎలా స్పందిచాలనే విషయమై చిరంజీవి కుటుంబంలో విభిన్న ఆలోచనలు తలెత్తినట్లు టాలీవుడ్ సమాచారం. తమ ఇరు కుటుంబాలూ కలిసి అధికారికంగా పెద్ద యెత్తున హైదరాబాదులో తమ పెళ్ళి రిసెప్షన్ ఏర్పాటు చేస్తే తప్ప తాము హైదరాబాదుకు వచ్చేది లేదని శ్రీజ ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో తేల్చి చెప్పిన ప్రస్తుత తరుణంలో చిరంజీవి కుటుంబంలో విభిన్నమైన స్వరాలు వినిపిస్తున్నాయని తెలిసింది. శ్రీజ కోరికకు తగ్గట్లే పెద్ద యెత్తున రిసెప్షన్ ఏర్పాటు చేద్దామని కొందరు భావిస్తుండగా, అలా చేయడం సరికాదని, ఇంత చేసిన శ్రీజ తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే "తాన తందానా..." అంటూ వత్తాసు పలికినట్లు వ్యవహరించడం మంచిది కాదని కొందరి వాదన. శ్రీజ కోరినట్లు తము శిరీష్ భరద్వాజ్ తల్లిదండృలదగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి తీసుకురావడం సరైన నిర్ణయమేనా అని వారు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఆ రెండు కుటుంబాలవారితో నేను మాట్లాడి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకువస్తానని చెప్పిన అల్లు అరవింద్ ప్రస్తుతం ఆ ఊసే ఎత్తకుండా, ప్రస్తుతానికి ఢిల్లీ వ్యవహారాలపైనే దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది. వచ్చే సోమవారం జరిగే సంఘటనలను బట్టి, అప్పటి కోర్టు తీర్పు, శ్రీజల ఆలోచనలను బట్టి అందుకు తగ్గట్లుగా తగిన నిర్ణయాలను అప్పుడే తీసుకోవాలని అతను భావిస్తున్నట్లు తెలిసింది. ఇక పవన్ కళ్యాణ్ సంఘటన జరిగిన దగ్గర్నుంచి కేవల మూడు మార్లు మాత్రమే చిరంజీవి ఇంటికి వెళ్ళినట్లు తెలిసింది. రేణుకా దేశాయ్ ఎక్కువ సమయాన్ని చిరంజీవి ఇంట్లోనే గడుపుతొంది. చిరంజీవి మరో తమ్ముడు నాగేంద్ర బాబు ఎక్కువగా చిరంజీవి వ్యవహారాలను చూస్తున్నట్లు తెలిసింది. వచ్చిపోయే వారిని నాగేంద్ర బాబే ఎక్కువగా రిసీవ్ చేసుకుంటున్నాడు. ఈ వ్యవహారంపై ప్రస్తుతానికి చిరంజీవి మాత్రం మౌనంగా ఉంటున్నట్లు తెలిసింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించనున్న మహేశ్ బాబు




క్రియేటివ్ దర్శకుడిగా పేర్గాంచిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు నటించనున్నాడు. ఇందుకు ప్రాధమిక స్థాయి అవగాహన పూర్తవడమే కాకుండా, మరో రెండు రోజులలో అగ్రిమెంట్లపై సంతకాలు కూడా జరుగనున్నాయి. అసలు విషయం ఏమిటంటే హీరో మహేశ్ బాబు యు టి వి సంస్థతో మూడు చిత్రాల రూపకల్పనకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. వీటిలో మొదటిదైన "అతిధి" ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఇక రెండవ చిత్రంగా లారెన్స్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చివరిదైన మూడవ చిత్రంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించవలసిందిగా యు టి వి సంస్థ మహేశ్ బాబుకు సూచించింది. ఇదే విషయమై శేఖే కమ్ముల తో చర్చించిన సంస్థ అతడిని ఒప్పించింది. మహేశ్ బాబు కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నాడు. దాంతో దీనికి సంబంధించిన అగ్రిమెంట్లు ప్రస్తుతం సిద్దం చేస్తున్నారు. అయితే మహేశ్ బాబు బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథ ప్రస్తుతం తనదగ్గర లేదని, కథ రూపొందించడానికి కొంత సమయం పడుతుందని, ఈ లోగా తాను మరో లో బడ్జెట్ చిత్రాన్ని రూపొందించాల్సి ఉందని శేఖర్ కమ్ముల యు టి వి సంస్థకు తెలిపారు. దానికి ఒప్పుకున్న సంస్థ మహేశ్ తమ సంస్థలో నటించే మూడవ చిత్రానికి దర్శకత్వం వహించవలసిందిగా కోరారు. ఇటు శేఖర్ కమ్ముల, అటు మహేశ్ బాబు ఒప్పుకోవడంతో మిగిలిన కార్యక్రమాలపై యు టి వి దృష్టి సారించింది.

విక్టరీ వెంకటేశ్ లేటెస్ట్ హేర్ స్టైల్...(ఫోటో గ్యాలరీ)
















నారీ..నారీ నడుమ "జగపతి"...("స్వాగతం" గ్యాలరీ)





Thursday, October 25, 2007

శంకర్ "రోబోట్" ను తిరస్కరించిన షారుఖ్ ఖాన్




కోలీవుడ్ లో హాటెస్ట్ డైరెక్టర్ శంకర్ డ్రీం ప్రాజెక్ట్ "రోబోట్" చిత్రాన్ని బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తిరస్కరించాడు. శంకర్ డ్రీం ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకున్న ఈ కథతో గతంలో కమల్ హాసన్, రజినీ కాంత్ లతో చిత్రాన్ని నిర్మించాలని శంకర్ భావించినా వారు ఈ కథకు ఒప్పుకోకపోవడంతో, బాలీవుడ్ పై దృష్టి పెట్టిన శంకర్ ఈ కథ తో చిత్రానికి షారుఖ్ ను ఒప్పించాడు. కథ కు బాగా ఇంప్రెస్ అయిన షారుఖ్ ఖాన్ దీనిని తానే తన రెడ్ చిల్లీస్ బ్యానరుపై చిత్రీకరిస్తానని ఒప్పుకోవడం కూడా జరిగిన తర్వాత, అకస్మాత్తుగా ఈ ప్రాజెక్ట్ ను షారుఖ్ తిరస్కరించినట్లు బాలీవుడ్ లో వార్తలు గుప్పుమన్నాయి. చివరికి అది నిజమేనని తేలింది. ఇద్దరికీ అనుకూలంగానే ఉన్న ఈ ప్రాజెక్ట్ అకస్మాత్తుగా ఆగిపోవడానికి శంకర్ చెబుతున్న పొంతనలేని బడ్జెట్టే ప్రధాన కారనమని బాలీవుడ్ వర్గాల భొగట్టా. ఇక చివరికి ఈ చిత్రాన్ని కోలీవుడ్ నటుడు అజిత్ తో నిర్మించాలని డైరెక్టర్ శంకర్ భావిస్తున్నట్లు తెలిసింది.

పాటల చిత్రీకరణలో యంగ్ ఎన్ టి ఆర్ "కంత్రి"


యంగ్ ఎన్ టి ఆర్ , హాన్సికా మోత్వాని జంటగా నటిస్తున్న "కంత్రి" చిత్రం పాటల చిత్రీకరణ ప్రారంభమైంది. ఎన్టీఆర్, హన్సికా మొత్వానీ లపై ప్రస్తుతం పాట చిత్రీకరణ జరుగుతోంది. హీరో ఎన్టీఆర్, హీరోయిన్ హాన్సికా మోత్వానిలపై హైదరాబాదులో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ పాట చిత్రంలోని మాస్ పాటలలో ఒకటని తెలిసింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

లండన్ మ్యూజియంలో ప్రతిష్టించనున్న రజనీకాంత్ విగ్రహం


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సూపర్ గ్లామర్ పవర్ ఇప్పుడు లండన్ ను తాకింది. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వాక్స్ స్టాచ్యూను ఏర్పాటు చేయనున్నారు. రజనీకాంత్ అభిమానుల నుంచి కుప్పలుతెప్పలుగా వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికి 12000 పిటిషన్లు తమకు అందాయని వారు అన్నారు. రజనీకాంత్ ఫ్యాన్స్ ఇందుకోసం పెద్దయెత్తున ప్రచారాన్ని మొదలుపెట్టి అందులో విజయం సాధించారు. ఇందుకోసం వారు www.petitiononline.comకు తమ పిటిషన్లను పోస్ట్ చేశారు. శివాజీ సినిమా చేసిన బిజినెస్ వివరాలు తెలుపుతూ విగ్రహ ఏర్పాటుకు రజనీకాంత్ కచ్చితంగా అర్హుడనే విషయాన్ని వారు ఈ పిటిషన్ లో వివరించారు. రజనీకాంత్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిఉన్న విషయాన్ని వారు ఇందులో తెలియజేశారు. ఈ పిటిషన్ లో 11453 మంది సంతకాలు చేశారు. పిటిషన్ లో అభిమానులు వాదించిన తీరు...భారతదేశంలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడు, భారత్ లో అగ్ర నటుడు, దక్షిణ భారతంలోని 100 మిలియన్ల జనాభా ఆరాధ్యుడు రజనీ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ చేస్తాయి. "శివాజీ" సినిమా బ్రిటన్ లో టాప్ 10లో నిలిచింది, అమెరికాలోనూ తన సత్తాను చూపింది, మలేసియా, సింగపూర్, మిడిల్ ఈస్ట్, హాంగ్ కాంగ్, దక్షిణాఫ్రికా, జపాన్, చైనాలలో రజనీ అభిమానులు ఉన్నారు. రజనీని విపరీతంగా అభిమానించే శ్రీలంక తమిళులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. బ్రిటన్ లో 150,000, ఫ్రాన్స్ లో 60,000 మంది ఉన్నారు. జపాన్లో రజనీ హవా అంతా ఇంతా కాదు. ప్రధాని మన్మోహన్ సింగే స్వయంగా జపాన్ పార్లమెంట్ లో రజనీకాంత్ ప్రభావం గూర్చి చెప్పాడు.ఈ కారణాలు సబబుగానే అనిపించాయి కాబట్టే రజనీ నిగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అధికారులు తెలిపారు.విశేషమేమంటే రజనీకాంత్ వ్యవహారం సక్సెస్ కావడంతో కమల్ హాసన్ అభిమానులు కూడా మేడమ్ టుస్సాడ్స్ కు పిటిషన్ పంపారు. ఇప్పటికి 900మంది ఫ్యాన్స్ సంతకాలు చేశారు.

సి ఎం కు ఫోన్ చేసిన చిరంజీవి...!?


ప్రముఖ నటుడు చిరంజీవి ఈ రోజు ఉదయం రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసినట్లు తెలిసింది. శ్రీజ వివాహం తర్వాత చిరంజీవి తనకు తానుగా దాదాపు ఎవరికీ ఫోన్ చేయడం లేదు. అలాంటిది మొదటిసారిగా చిరంజీవి ఈరోజు వై ఎస్ ఆర్ కు ఫోన్ చేసి శ్రీజతో ఫోన్లో మాట్లాడే ఏర్పాటు చేయవలసిందిగా కోరినట్లు తెలిసింది. గత 19వ తేదీన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. కాగా, ఈరోజు చిరంజీవి వై ఎస్ ఆర్ కు ఫోన్ చేసి, తనకు శ్రీజతో ఒకసారి మాట్లాడాలని ఉందనీ, తను మానుంచి ఎలాంటి కీడును శంకించాల్సిన పని లేదని, ఒక వేల శ్రీజ రమ్మంటే తాము ఢిల్లీకి వెళ్ళి కోర్టులో తగిన పత్రాలు సమర్పించి శ్రీజను, శిరీష్ భరద్వాజ్ ను వెంటబెట్టుకుని రావడానికి సిద్దమేనని ఆయన చూచాయనగా సి ఎం తో అన్నట్లు ఫిలిం నగర్ సమాచారం. ముఖ్యమంత్రి కూడా దానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. శ్రీజ చిన్న తనంతో స్పందిస్తోంది, దనిని మనసులో ఉంచుకోవద్దని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిరంజీవికి సూచించినట్లు సమాచారం. అయితే ఈ ఫోను వ్యవహారం గూర్చి విలేఖరులు ముఖ్యమంత్రి కార్యాలయంలో సంప్రదించగా, అలాంటిదేమీ లేదని వారు తెలిపినట్లు తెలిసింది. అయితే ఫిలిం నగర్లో మాత్రం ఈ విషయం గట్టిగానే చర్చించుకుంటున్నట్లు తెలిసింది.

హాలీవుడ్ అందాల నాయిక "డి.బెర్రీమోర్" (ఎక్స్ క్లూజివ్ ఫోటో గ్యాలరీ)







ప్రారంభమైన బాలకృష్ణ "రంగా పాండురంగా"


కలెక్షన్ కింగ్ ,యువరత్న నందమూరి బాలకృష్ణ పాండురంగడుగా, భక్తునిగా ద్విపాత్రాభినయం చేస్తున్న "రంగా పాండురంగా" చిత్ర కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 22న హైదరాబాదులోని రామకృష్ణ సినీ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. స్వర్గీయ ఎన్ టి ఆర్ నటించిన "పాండురంగ మహత్మ్యం" చిత్రం ఆధారంగా, కొన్ని చిన్న చిన్న మార్పులతో నిర్మించస్నున్న ఈ చిత్రంలో మొత్తం పన్నెండు మంది కథానాయికలు నటించనున్నారు. అయితే హీరోయిన్ గా ప్రధాన పాత్రలలో నటించేది మాత్రం ఇద్దరే. మిగతా పది మందీ పాడురంగని పాత్రతోబాటు గోపికలుగా అతిధి పాత్రలలో నటించనున్నారు. ఈ చిత్రంలో పన్నెండు పాటలుంటాయని తెలిసింది. వీటికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయ్యాయి. జె కె భారవి కథా నిర్వహణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకనిర్మాత కె రాఘవేంద్ర రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని తెలిసింది. కాగా పాత "పాడురంగ మహత్మ్యం" లో భక్తునిగా ఎన్ టి ఆర్ నటించగా, భగవంతునిగా నటి విజయనిర్మల నటించింది.

తెలుగులో నటించాలని ఉంది: ప్రియాంక చోప్రా




అవకాశం వస్తే తెలుగు సినిమాల్లో నటిస్తానని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చెప్పారు. హైదరాబాదులో ఒక ఫేషన్ షోలో పాల్గొనడానికి వచ్చిన ఆమె బుధవారంనాడు కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలుగు సినిమాల్లో నటించడానికి తనకు ఏ విధమైన అభ్యంతరం లేదని ఆయన అన్నారు. హైదరాబాదు నగరం చాలా బాగుందని, ఈ నగరమంటే తనకెంతో ఇష్టమని ఆమె అన్నారు. తమిళ సినిమాతో ప్రియాంక చోప్రా సినీ రంగ ప్రవేశం చేశారు.

రేపు కనిపించే అతిపెద్ద "చంద్రుడు" ఇంతపెద్దగా కనిపిస్తాడంటారా..? (పే...ద్ద ఫోటో) మీకోసం

(గమనిక: ఈ వార్త చివరన ఉన్న ఫోటోపై క్లిక్ చేసి పెద్ద చిత్రాన్ని చూడండి)




ప్రతి ఏడాదికోసారి కనిపించే అతిపెద్ద చంద్ర దర్శనం శుక్రవారం కనిపించి, కనువిందు చేయనుంది. చందమామ రావే... జాబిల్లి రావే... అంటూ చిన్నారులను లాలించేందుకు ఎంత పిలిచినా దిగిరాని చంద్రుడు,శుక్రవారం మాత్రం భూమికి అతి దగ్గరగా రానున్నాడు. ఈ కారణంగా చంద్రుడు మామూలు పరిమాణం కంటే, అతిపెద్దగా కనిపించనున్నాడు. ఈ శుభ సందర్భంలో చందమామను తనివితీరా చూసుకోవచ్చు. ఇలాంటి అవకాశం ఏడాదికోసారి మాత్రమే వస్తుంది. ప్రతి పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా కనిపించడం మామూలే. కానీ ఈ గురువారం, శుక్రవారాల్లో వచ్చే చంద్రుడు 14 శాతం పెద్దగా దర్శనమివ్వనున్నాడు. అలాగే చంద్ర వెలుగులు కూడా 30 శాతం అధికంగా విరజిమ్ముతాడని అమెరికాకు చెందిన నాసా నిపుణులు వెల్లడించారు. సాధారణంగా చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతాడు. ఆ సమయంలో భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న కనిష్ఠ దూరం 48 వేల కిలోమీటర్లు. ఈ పౌర్ణానికి భూమికి అతి సమీపానికి వచ్చే చందమామను మాత్రం టెలిస్కోప్‌లో తగిన ఫిల్టర్లు లేకుండా దర్శించడం నేత్రాలకు హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చివరి షెడ్యూల్ ప్రారంభమైన టబు చిత్రం


బాలీవుడ్ నటి టబు, అబ్బాస్ జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావస్తోంది. "ఆ నలుగురు" ఫేం దర్శకుడు చంద్రసిద్ధార్థ ఫిల్మోత్సవ్ బ్యానర్ పతాకంపై నిర్మిస్తున్నారు. పతంజలి రాసిన "నువ్వే కాదు" అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న ఈ చిత్రం మానవ నైజాన్ని తెలిపై సస్పెన్స్ థ్రిల్లర్. ఆద్యంతం వినోదాన్ని పంచే సన్నివేశాలు చిత్రంలో అధికంగా ఉన్నట్లు తెలిసింది. మొత్తం ఐదు పాటలు ఉండే ఈ చిత్రంలో టబు ఓ గమ్మత్తైన పాత్రలో నటిస్తుండగా, రాజా ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఈ రోజు నుంచి నవంబరు నెలాఖరు వరకు జరుగుతుంది. చైతన్య ప్రసాద్ రాసిన "పట్టు చీర కట్టి పూలెట్టుకెళితే" అనే పాటను టబు, తదితరులపై చిత్రీకరించినట్టు చెప్పారు. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, సునీల్, చలపతి రావు, కృష్ణమోహన్, సూర్య, సుమన్ శెట్టి, హేమ, అపూర్వ, మెల్కోటే, బేబి పూజా జాస్మిన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు, కెఎన్.వై.పతంజలి, ఛాయాగ్రహణం.. జెకె.గుమ్మడి, ఎడిటింగ్.. రుద్ర.

దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న "టక్కరి"


"వెళ్ళవయ్యా..వెళ్ళూ..." డైలాగుతో తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న "జయం" జంట సదా, నితిన్ ల మరో చిత్రం "టక్కరి" ఈ దీపావళికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్, సదా నటించిన "జయం" చిత్రం సూపర్ డూపర్ హిట్‌ను సాధించిన విషయం తెల్సిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో "టక్కరి" చిత్రం రూపుదిద్దుకుంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరచూరి శివరామ్ ప్రసాద్ నిర్మిస్తున్న "టక్కరి" చిత్రాన్ని దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి "అమ్మ" రాజశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా, చక్రీ సంగీతం సమకూర్చారు. చిత్ర నిర్మాత శివరామ్ ప్రసాద్ పత్రికలవారితో మాట్లాడుతూ నితిన్-సదా జంట అనగానే "జయం" సినిమా గుర్తుకువస్తుందని, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం "టక్కరి" అంతకు మించిన విజయం సాధిస్తుందని అన్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందన్నారు. మిగిలిన పాత్రల్లో చంద్రమోహన్, సాయాజీ షిండే, ఆలీ, రఘుబాబు, సత్యం రాజేష్, సుధ, గీతాసింగ్, వేణు, బేబి త్రిష తదితరులు నటించారు.

సినిమాల్లో నటించేందుకు అవకాశం కల్పించాలి: సుప్రీం కోర్టులో మోనికా బేడి పిటిషన్





సినీ అవకాశాలు విరివిగా వస్తున్నాయని అందువల్ల చిత్రాల్లో నటించేందుకు అవకాశం కల్పించాలని సినీనటి మోనికాబేడీ సుప్రీం కోర్టు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆమె బుధవారం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. హైదరాబాద్‌లో నమోదైన నకిలీ పాస్ పోర్టు ఫోర్జరీ కేసులో మోనికాకు బెయిలు లభించిన విషయం తెల్సిందే. అయితే.. భోపాల్‌ కేసులో మాత్రం ఇంకా బెయిలు లభించలేదు. ఈ కేసులో కూడా బెయిల్ కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో శాశ్వత నివాసమైన పంజాబ్‌లోని హోషియాప్పర్ జిల్లాలో చబ్బోవాల్‌ గ్రామాన్ని పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా విడిచి వెళ్లకూడదనే షరతుతో మే 17వ తేదీన బెయిలును మంజూరు చేసింది. దీంతో ఆమెకు సినీ అవకాశాలు వస్తున్నాయి. వీటిలో నటించేందుకు వీలుగా.. భోపాల్‌ కేసులో కూడా బెయిలును మంజూరు చేయాలని సుప్రీం కోర్టును కోరింది.

పవన్ "దండు" కదిలింది :"కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్"కు అనూహ్య స్పందన




పవర్ స్టార్ పవన్ కల్యాన్ పవర్ ఏమిటో పవన్ పిలుపునిచ్చిన కొద్ది సేపటికే అవగతమైంది. రాష్ట్రవ్యాప్తంగా కదిలిన యువతరం ఒక్కసారిగా "కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ జిందాబాద్", "పవన్ జిందాబాద్" అంటూ కాలేజీలను ఎగ్గొట్టిమరీ బారులుతీరడం పలువురిని ఆష్చర్యానికి గురిచేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు విపరీతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. హైదరాబాద్ నగరంలో మంగళవారంనాడు అరోరా, అవంతి కాలేజీ విద్యార్థులు మూకుమ్మడిగా స్పందించి క్షణాల్లో లక్షల రూపాయలను కూడగట్టారు. ర్యాలీలు తీశారు. ఈ స్పందనలో ఎక్కువగా అమ్మాయిలే ఉండడం విశేషం.రాజమండ్రిలోనూ బుధవారం ర్యాలీలు తీశారు. స్నేహ యూత్ క్లబ్, రాజమండ్రి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్లబ్, చిరంజీవి ఫ్యాన్స్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పవన్ పెట్టిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ జిందాబాద్, పవన్ జిందాబాద్ అంటూ కదిలారు. పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఫోర్స్ కోసం ప్రాణాలైనా అర్పిస్తామని వారీ సందర్భంగా అన్నారు.

నీళ్ళంటే ఇష్టం, నీటిలో ఆడటమంటే మరీ మరీ ఇష్టం:ఇలియానా (ఎక్స్ క్లూజివ్ ఫోటో గ్యాలరీ)





































తమిళంలో "కలుగు"గా అనువదింపబడుతున్న నితిన్ "సై"


నితిన్, జెనీలియా జంటగా నటించిన "సై" చిత్రం తలిళంలోకి అనువదింపబడుతోంది. రగ్బీ ఆట ప్రధానాంశంగా, పూర్తి స్థాయి కమర్శియల్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. ఇటీవల పలు తెలుగు చిత్రాలు తమిళంలోకి అనువదింపబడి విజయం సాధిస్తున్న దరిమిలా, ఇప్పుడు ఈ "సై" చిత్రాన్ని కూడా అనువదిస్తున్నారు. అయితే తమిళంలో ఈ చిత్రం పేరు మార్చుతున్నారు. తమిళంలో గతంలో ఇదే పేరుతో సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ఒక చిత్రం విడుదలైంది. దాంతో ఆ ఈ చిత్రానికి పేరు మార్చాలని తమిళనాడు డిస్త్రిబ్యూటర్ నిర్ణయించి, దీనికి "కలుగు" గా నిర్ణయించారు. ఈ చిత్రం త్వరలోనే తమిళనాడులో విడుదలవనుంది.

బ్యాంక్ దోపిడీకి మేం సిద్దం..మరి మీరో...?!(ఎక్స్ క్లూజివ్ గ్యాలరీ)











"అతిధి" @ UK హంగామా...!!






Wednesday, October 24, 2007

మా ప్రేమ కథను చిత్రంగా నిర్మిస్తే, అందులో మేమిద్దరం కలిసి నటిస్తాం :"మీడియా"తో శ్రీజ


మెగాస్టార్ ద్వితీయ కుమార్తె శ్రీజ,శిరీష్ భరద్వాజ్‌ల వివాహం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో పెను సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై విమర్శనాస్త్రాలు సంధించడంలో మాత్రం శ్రీజ ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. తాజాగా తమ ప్రేమ కథ బాలీవుడ్ లేదా టాలీవుడ్‌ చిత్రరంగంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించేందుకు సరిగ్గా సరిపోతుందని శ్రీజ అంటోంది. ఒకవేళ తమ ప్రేమ కథ తెరకెక్కితే ఆ చిత్రానికి తన తనండ్రి మెగాస్టారే నిర్మాతగా ఉండాలని శ్రీజ భావిస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ఈ చిత్రంలో తన భర్త శిరీష్‌తో కలసి నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు శ్రీజ న్యూఢిల్లీలో మీడియాతో వ్యాఖ్యానించింది. మా నాన్నకు ఒక్క విషయం చెపుతున్నా, నేను సురక్షితమైన హస్తాల్లోనే ఉన్నాట్టు స్పష్టం చేసింది. శ్రీజ-శిరీష్ దంపతులకు పోలీసు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన మరుక్షణం నుంచి శ్రీజ తమ ప్రేమ వ్యవహారంపై స్పందిస్తూనే ఉన్నారు. శిరీష్‌తో నాకున్న స్నేహం పట్ల డాడ్ వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి లోనుచేసింది. మా స్నేహాన్ని వదులుకోవాలని ఎంతో ఒత్తిడి తెచ్చారు. గృహనిర్భంధంలో ఉంచారు. మా కుటుంబంలోని ఎవరూ కూడా నాకు మద్దతు ఇవ్వలేదు. చివరికి మా అమ్మ కూడా అని శ్రీజ వ్యాఖ్యానించింది. నన్ను అర్థం చేసుకోవడంలో మా నాన్న విఫలమయ్యారు. నా నిజాయితీని, నమ్మకాన్ని నిరూపించుకునేందుకు కొంత సమయం నాకు కావాలని శ్రీజ అంటోంది.

జాతీయ జెండాకు అగౌరవం :అమీర్‌ఖాన్‌ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్


జాతీయ పతాకాన్ని అగౌరవ పరచిన వ్యవహారంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్‌ఖాన్‌కు ఇండోర్ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. గత ఆగస్టు నెల 16వ తేదీన ప్రముఖ పారిశ్రామికవేత్త అశోక్ రాజ్‌పాల్, రాకేష్ రాజ్‌పాల్‌లకు చెందిన కార్ల షో రూమ్ ప్రారంభోత్సవానికి ఈ బాలీవుడ్ నటుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మొత్తం 11 దేశాలకు చెందిన జాతీయ పతాకాలను ఎగురవేశారు. అయితే సూర్యాస్తమయం తర్వాత కూడా త్రివర్ణ పతాకాన్ని అవనతం చేయలేదు. అంతేకాకుండా, షోరూమ్‌లో పని చేసే సిబ్బంది కొంతమంది ఆ పతాకాలను తొలగించి కింద పడేసినట్టు ఆ కార్యక్రమానికి హాజరైన కొన్ని మీడియాలు వార్తా కథనాలను ప్రచురించాయి. దీనిపై న్యాయవాది శైలేంద్ర శర్మ దాఖలు చేసిన పిటీషన్ మేరకు ఇండోర్ న్యాయస్థానం అమీర్‌ఖాన్‌కు వ్యతిరేకంగా బెయిలు పొందే అవకాశంలేని అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది.

తన పేరుతో వ్యాపారం నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది : కమల్ హాసన్


కమల్ హాసన్ పేరుమీద గుర్తుతెలియని వ్యక్తులు వెబ్ సైట్ ను నడుపుతున్నారట. ఈ వెబ్ సైట్ విషయం తెలిసిన కమల్ హాసన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఇందుకు సంబంధించి వార్నింగ్ ఇస్తూ కమల్ హాసన్ పత్రికా ప్రకటన విడుదల చేశాడు. ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ తన పేరిట వెబ్ సైట్ ను ప్రారంభించి బిజినెస్ చేస్తున్నవారు ఇలాంటి పనులు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. కమల్ హాసన్ ప్రకటన మేరకు "కొంతమంది నా పేరుపై వ్వ్వ్.ఉనివెర్సళెరొకమల్.చొం ఓపెన్ చేసి ఈ సైట్ పేరు మీద టీ-షర్ట్స్ రూపొందించి అమ్ముతున్నారు.ఈ టీ-షర్ట్స్ పై నా బొమ్మలు ముద్రించారు,ఇందులో విశేషమేమంటే వ్వ్వ్.ఒర్కుత్.చొం కమల్ హాసన్ ఫ్యాన్స్ కమ్యూనిటీతో కలిసి ఈ పని చేస్తున్నారు. ఇదంతా నా అనుమతి లేకుండా చేస్తున్నారు. ఇలాంటివి మున్ముందు కూడా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుంది. వెంటనే మానుకోండని ఆయన వార్నింగ్ ఇచ్చాడు.తన ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టింది కేవలం సమాజ సేవ చేయడానికి తప్ప వ్యాపారం చేసి డబ్బు సంపాదించడానికి కాదని ఆయన అన్నాడు. 20 ఏళ్ల కిందటే కమల్ హాసన్ తన ఫ్యాన్స్ సంఘాలను సామాజిక సేవవైపు మళ్లించిన ఘనత కలవాడు. మయ్యమ్ అనే మ్యాగజైన్ ఫ్యాన్స్ వెల్పేర్ అసోసియేషన్ తీస్తున్నది. కమల్ ఏదైనా చెప్పదలచుకుంటే ఈ పత్రిక ద్వారా చెబుతాడు. కమల్ భర్త్ డే రోజు పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం చాన్నాళ్లుగా జరుగుతూవస్తోంది. పోర్టల్స్ విషయంలో తన ఫ్యాన్స్ అప్రమత్తతతో ఉండాలని సూచించారు. తన పేరిట వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని కమల్ చెప్పారు.

పవన్ సి ఎం పి ఎఫ్ లో చేరాలనుకుంటే ఈ క్రింది ఫోన్ నంబర్లలో సంప్రదించండి


పవన్ కళ్యాణ్ స్థాపించిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో వాలంటీర్ల రిక్రూట్ మెంట్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ వివరాలు వెల్లడించాడు. తాను స్థాపించిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా స్పందన అనూహ్యంగా వచ్చిందని ఆయన తెలిపాడు. చాలా మంది డొనేషన్లు అందజేస్తామంటున్నారని, అయితే తనకు డొనేషన్ల కన్నా రక్షణ కవచాల్లా వ్యవహరించే వాలంటీర్లే ముఖ్యమని ఆయన పేర్కొన్నాడు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఇష్టమున్నవారు సభ్యులు కావచ్చని ఆయన పత్రికా ప్రకటనలో తెలిపాడు. సామాజిక సేవచేయడానికి వాలంటీర్లు తమ వంతు సేవ చేయడానికి కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉపయుక్తమవుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి డబ్బు అవసరం లేదని, ఒకవేళ డబ్బే కనుక అవసరమైతే ప్రకటన విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో చేరాలనుకుంటున్న వారు ఏ రాష్ట్రంలో ఉన్నా, లేక మరే దేశంలో ఉన్నా అక్కడినుంచే సంస్థ కార్యకలాపాలలో పాలుపంచుకోవచ్చని, ఆసక్తి గల వారు +91(40)9866344833,+91(40)9866344733 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చునని ఆయన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

జెస్సీ మెట్ కాఫ్ తో హాలీవుడ్ సినిమాలో నటించనున్న శ్రియా సరన్


శివాజీ సినిమా శ్రియా జీవితాన్నే మలుపుతిప్పింది. ఇలియానా, త్రిషా, నయనతార ఊపుతో తెలుగులో అవశాలు లేని పరిస్థితిలో శ్రియాకు శివాజీ సినిమా వరంలా వచ్చింది. సినిమా నిర్మాణం ఆలస్యమయినా విడుదల అయిన తరువాత పెను సంచలనమే సృష్టించింది. విజయం ఇచ్చిన కిక్కు శ్రియాను అవకాశాల వెల్లువలో కొట్టుకుపోయేలా చేస్తోంది. తమిళ సినిమాలలో అవకాశాల మీద అవకాశాలు ఆమె తలుపు తట్టుతున్నాయి. బాలీవుడ్ లోనూ శ్రియా అవారాపన్ సినిమాలో నటించేలా చేసింది. ఇపుడు ఆమె ఎంతటి క్రేజ్ ను సంపాదించిందంటే ఒక ఐటమ్ సాంగ్ కే 50 లక్షల రూపాయలు సంపాదించిపెట్టేలా చేస్తోంది.ఇదిలా ఉంటే శ్రియాకు తాజాగా హాలీవుడ్ అవకాశం వచ్చింది. జెస్సీ మెట్ కాఫ్ తో నటించే అద్భుత అవకాశం లభించింది. హైడ్ పార్క్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్(ప్రకాశ్ అమృత్ రాజ్ స్వంత నిర్మాణ సంస్థ) నిర్మించే ఈ సినిమా కాల్ సెంటర్ నేపథ్యంలో సాగుతుంది. కాగా మెట్ కాఫ్ ప్రస్తుతం డెస్పరేట్ హౌజ్ వైవ్స్ సినిమాలో చేస్తున్నాడు.

డాడీ మాటలు నమ్మను, ప్రస్తుతానికి ఢిల్లీలోనే నివాసం:"జీ టీవీ" ఇంటర్వ్యూలో శ్రీజ


ప్రాణభయం ఇంకా పోలేదని శ్రీజ జాతీయ న్యూస్ చానల్ కు చెప్పింది... వివరాలు తండ్రి చిరంజీవికి తన ప్రేమ వ్యవహారాన్ని అనేకసార్లు చెప్పానని, ఆయన పెళ్ళికి అంగీకరించలేదని చిరు తనయ శ్రీజ ఢిల్లీలో జీటీవీ స్టూడియోలో ముఖాముఖ కార్యక్రమంలో చెప్పింది. "నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలమ్మా"అంటూ చిరంజీవి టీవీల, పత్రికా ముఖంగా చేసిన ప్రకటనను తాను పూర్తిగా నమ్మడం లేదని శ్రీజ చెప్పింది. శిరీష్ బ్రాహ్మణుడు కావడం, మధ్యతరగతి వ్యక్తి కావడం వల్లనే తన తండ్రి తమ ప్రేమకు అడ్డు తగిలారని ఆమె స్పష్టం చేసింది. ఇంట్లో వారిని ధిక్కరించి ప్రేమ పెళ్ళి చేసుకున్న అబ్బాయిలను ఆమ్మాయి తరఫు వారు కిడ్నాప్ చేసి చంపేసిన సంఘటనలు చాలా ఉన్నాయని శ్రీజ చెప్పింది. అందువల్ల తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపింది. మీ బాబాయి పవన్ కళ్యాణ్ నుంచి ప్రాణభయం ఉందా అని ప్రశ్నించగా దాని గురించి ఆలోచించలేదని, ఇక మీదట తమ ప్రాణాలకు ముప్పు ఉండవచ్చని చెప్పింది. ఈ టీవీ కార్యక్రమంలో శ్రీజతో పాటు పాల్గొన్న ఆమె భర్త శిరీష్ భరద్వాజ్ ఇంకా తెలివిగా మాట్లాడాడు. తమ పెళ్ళి గురించి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి మాట్లాడాలనుకున్నానని, కానీ వారు ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. శ్రీజను ఏడాదిగా గృహ నిర్బంధంలో ఉంచడం, ఆమె పెళ్ళి సంబంధాలు చూడడం వంటి పరిణామాల నేపధ్యంలో ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నామని చెప్పాడు. తమ ప్రాణాలకు రక్షణ ఉంటుందన్న నమ్మకం పూర్తిగా వచ్చిన తర్వాతే హైదరాబాద్ వెళ్తామని, అప్పటి వరకు ఢిల్లీలోనే ఉంటామని అతను తెలిపాడు.

యమలోకంలో కమెడియన్ వడివేలుతో ఆడి, పాడిన శ్రేయ (పోటో గ్యాలరీ)






















ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్"(24/10/2007)

అంతర్జాతీయ సినీ ప్రపంచంలో సినిమాలపై వచ్చే "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్" చాలా ప్రతిష్టాత్మకమైనవి. అంతర్జాతీయంగా దాదాపు ప్రతి సినీ నిర్మాత, దర్శకుడు, టెక్నీషియన్ సహా సినిమాలతో సంబంధం వుండే ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా చూసే ఈ "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్" ను గత వారం నుంచి ఈ బ్లాగులో ప్రచురిస్తున్న విషయం బ్లాగర్లకు తెలుసు. సినిమాలపై, సినీ నిర్మాణంపై, సినీ వ్యాపారంపై అత్యంత ప్రభావం చూయించే ఈ "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్" ను యధా తతంగా ప్రచురించనున్నాము.ముందుగా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శింపబడుతున్న చిత్రాలకు రెడ్ కార్పెట్ సంస్థ ఇచ్చిన రేటింగ్స్, ఆ తర్వాత ఈ వారం విడుదల కాబోయే చిత్రాలకు సంబధించిన రేటింగ్స్ ప్రచురిస్తున్నాము. అంతర్జాతీయ సినిమాలగూర్చి తెలుసుకోవాలనే వారు వీటిని గమనించగలరు.
థియేటర్లలో ప్రదర్శింపబడుతున్న చిత్రాలకు రెడ్ కార్పెట్ రేటింగ్స్
(గమనిక : ముందుగా సినిమా పేరు, వెంటనే ఆయా చిత్రానికి రెడ్ కార్పెట్ ఇచ్చిన రేటింగ్ లను చూడగలరు)
30 Days of Night : Rating-R
(for strong horror violence and language)
Bordertown : Rating -R
(for violence including a brutal rape, sexuality, nudity and language)
The Comebacks : Rating -PG-13
(for crude and sexual content throughout and some drug material)
Gone Baby Gone : Rating -R
(for violence, drug content and pervasive language)
Hoe to cook your life : Rating -PG-13
(for brief strong language)
O Jerusalem : Rating -R
(for some war scenes)
Rendition : Rating- R
(for torture/violence and language)
Reservation road : Rating -R
(for language and some disturbing images)
Sarah London and the paranarmal hour :Rating -PG
(for thematic elements, mild peril and language)
Things we lost in the fire : Rating-R
(for drug content and language)
Wristcutters:A Love Story :Rating -R
(for language and disturbing content involving suicide)
ఈ వారం విడుదల కాబోయే చిత్రాలకు రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్
Before the Devil knows you're the Dead : R
(for a scene of strong graphic sexuality, nudity, violence, drug use and language)
Bella : Rating -PG-13
(for thematic elements and brief disturbing images)
Dan in real life :Rating - PG-13
(for some innuendo)
Jimmy Carter the man from plains : Rating - PG
(for some thematic elements and brief disturbing images)
Music Within : Rating - R
(for language including sexual references, and some drug content)
Rails & Tyes : Rating - PG-13
(for mature thematic elements, an accident scene, brief nudity and momentary strong language)
Saw-IV : Rating - R
(for sequences of grisly bloody violence and torture throughout, and for language)


RATINGS GUIDE
G : GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children) PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED

శ్రీవెంకట్ బులెమోని

పవన్ కళ్యాణ్ స్థాపించిన సి ఎం పి ఎఫ్ కు విరాలాల వెల్లువ




పవన్ కళ్యాణ్ నూతనంగా స్థాపించిన "కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్"(సి ఎం పి ఎఫ్) కు రాష్ట్ర వ్యాప్తంగా విరాలాలు వెల్లువెత్తాయి. సోమవారం ఈ సంస్థను స్థాపిస్తూ పవన్ తన వంతుగా కోటి రూపాయల మొత్తాన్ని ప్రారంభ నిధిగా ప్రకటించడమే కాకుండా, దీనికి సంబంధించిన చెక్కును కూడా మీడియాకు చూయించడం అందరికీ తెలిసిందే. దీనికి అనూహ్యంగా స్పందించిన పవన్ కళ్యాణ్ అభిమానులు మంగళవారం పెద్దయెత్తున పవన్ నివాసానికి తరలివచ్చి తమవంతుగా సంస్థ కోసం విరాళాలను ప్రకటిస్తూండటంతో పవన్ వారిని సున్నితంగా త్రొసిపుచ్చి, ప్రస్తుతానికి ఎలాంటి విరాలాలూ వద్దని, ముందుగా సంస్థను ప్రారంభించడానికి ఇతర వనరులు, సిద్దాంతాలు, కార్యకలాపాలు...ఇలా చాలా వ్యవహారాలున్నాయని, ముందుగా వాటిని పూర్తి చేయడం కోసం తనకు నైతిక మద్దతును అందిస్తే చాలునని నచ్చచెప్పారు. అందుకు అభిమానులు పవన్ కు ఎళ్ళవేళలా తోడు ఉంటామని వాగ్ధానం చసినట్లు తెలిసింది. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్"(సి ఎం పి ఎఫ్)ను పూర్తిస్థాయిలో వ్యవస్థీకృతం చేసేంత వరకు విరాళాలు, ఇతర నిధుల ప్రస్థావన తీసుకురావద్దని, రెండో దశ పనుల్లోకి వెళ్ళేకన్నా ముందు మొదటి దశను విజయవంతంగా పూర్తిచేయవలసి ఉందని ఆయన తన అభిమానులకు తెలిపినట్లు తెలిసింది.

భూమిక పెళ్ళి ఫోటోలు



Tuesday, October 23, 2007

హర్రర్ ఫిలిం ఫెస్టివల్-2007 ట్రైలర్

video

ఈ సంవత్సరం నవంబర్ 9 నుంచి 18 వరకు జరుగనున్న అంతర్జాతీయ స్థాయి హర్రర్ ఫిలిం ఫెస్టివల్ ట్రైలర్ ఈ క్రింద ఇస్తున్నాము గమనించండి.

బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ : ఈ వారం టాప్-5 ఫిలింస్

1. ఊరించి దెబ్బ కొట్టిన "అతిధి" మొదటి నాలుగు రోజుల కలెక్ష్న్ పరంగానే మహేశ్ బాబు "అతిధి" మొదటి స్థానాన్ని ఆక్రమించింది తప్ప సినిమాలో ఏమీ లేదని టాలీవుడ్ టాక్. సినిమాకు హీరో కేంద్ర బిందువు కావడంలో తప్పు లేదు కానీ, హీరోనే మొత్తం కావడం ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారని పరిశ్రమ అంటోంది. కథ, కథనం దగ్గర్నుంచి సినిమాలో అనేక విషయాలు ప్రేక్షకులకు రుచించలేదు. అయితే దసరా పర్వదినం సందర్భంగా వచ్చిన సెలవులు, అదిరిపోయే పబ్లిసిటీ వల్ల ఈ చెత్రం ఈ వారంలో అత్యధిక కలెక్షన్లు కలిగిన చిత్రంగా నిలబడింది. అయితే ఫిలిం నగర్ మాత్రం ఈ చిత్రం యావరేజ్ నుంచి బిలో యావరేజ్ చిత్రం గా నిలబడుతుందని అంటోంది.
2. "తులసి"కి తగ్గిన కలెక్షన్లు
విక్టరీ వెంకటేష్ నటించిన "తులసి" చిత్రం కలెక్షన్లు బాగా తగ్గాయి. కుటుంబ హీరోగా పేర్గాంచిన వెంకటేశ్ ఓవర్ మాసిజం చూయించడం వల్ల మహిళా ప్రేక్షకులు ఈ చిత్రానికి బాగా తగ్గారు. కుటుంబ సమేతంగా చూసే వారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టడం వల్ల ఈ చిత్ర కలెక్షన్లు తగ్గాయి.
3. ఇప్పటికీ నిలకడగా వుంది "హ్యాప్పీ డేస్" ఒక్కటే
శేఖర్ కమ్ముల చిత్రం "హ్యాప్పీ డేస్" చిత్రం కలెక్షన్లు ఇప్పటికీ నిలకడగా సాగుతున్నాయి. యువతతోబాటు కుటుంబ, మహిళా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు.
4. అలిసిపోయిన "చిరుత"
రాం చరన్ తేజ్ నటించిన "చిరుత" చిత్రం టాప్-5 పరుగు పందెంలో అలిసిపోయింది. కలెక్షన్లు తగ్గడమే కాకుండా, ఎక్కడ చూసినా సినిమా ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదు.
5. అయిదవ స్థానంలో "భయ్యా"

విశాల్ నటించిన "భయ్యా" చిత్రం అయిదవ స్థానాన్ని ఆక్రమించింది. ద్విభాషా చిత్రమిన దీనికి ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. "యావరేజ్ ఫిలిం" టాక్ తో చిత్రం కొనసాగుతొంది. ఒక్కసారి చూడవచ్చు అని సినీ పరిశ్రమ అభిప్రాయం.

శ్రీవెంకట్ బులెమోని

తెరవెనుక ఉన్నది పి జె ఆర్ తనయుడే..నా...!?


చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం వెనుక ఉన్న అజ్ఞాత హస్తం ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి జనార్ధన్ రెడ్డి కుమారుడిదేనని హైదరాబాదులో ప్రాధమిక అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా వెళ్ళడించడానికి ధైర్యం చయడం లేదు. పోలీసులు కూడా ప్రాధమిక దర్యాప్తులో ఇదే విషయాన్ని చూచాయనగా తెలుసుకున్నా, ఇంతవరకు చిరంజీవి వైపు నుంచి కానీ, అతని తరుపు వారి నుంచికానీ ఎలాంటి ఫిర్యాదు లేకపోవడం వల్ల అందరూ "మనకెందుకులే" అన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలిసింది. శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ల వివాహం జరగగానే ఏమాత్రం ఆర్థిక పరిపుష్టి లేని శిరీష్ భరద్వాజ్ ఏకంగా పలు కార్లు మారుతూ శ్రీజతో ముందుగా గోవా వెళ్ళడం, ఆ వెంటనే అక్కడినుంచి తమ ప్రయాణాన్ని ఢిల్లీకి మార్చడం అంతా ప్రణాళికా బద్దంగా జరిగిందని పలువురి అభిప్రాయం. శ్రీజ, శిరీష్ భరద్వాజ్ లను హైదరాబాదు నుంచి పంపించేప్పుడు పి జె ఆర్ తనయుడు వీరికి లక్ష రూపాయలను ఇవ్వడమే కాకుండా, రెండు డెబిట్ కార్డులను కూడా వారికి ఇచ్చి పంపించడం జరిగిందని తెలుస్తోంది. అలాగే వీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళకన్నా ముందే వారికి అక్కడి హోటళ్ళలో బస ఏర్పాటు చేయడం, ఢిల్లీలో పెద్ద లాయర్ అయిన పింకీని ఏర్పాటు చేయడం అంతా అనుకున్నట్లే జరిపిస్తున్నారని కొందరు ఫిలిం నగర్ వాసులు అభిప్రాయపడుతున్నారు. నిజం ఆ దేవునికే తెలియాలి, కానీ ఒక్కో మలుపు సినిమాని మించిపోతోందన్నది ఫిలిం నగర్ టాక్.

ఢిల్లీ కోర్టు బయట విలేఖరులతో మాట్లాడుతున్న శ్రీజ (వీడియో)

video

పగిలిన గుండెలు...పేలని తూటాలు- చెమర్చిన "చిరు" పితృ హృదయం


ఇలాంటి సంఘటన మరే ఇంటా జరగకూడదని ఆ దేవుడ్ని మరీ మరీ కొరుకుంటున్న పగిలిన హృదయాలు వారివి. పరిస్థితులప్రభావం వల్ల గుంభణంగా వుండే ఆ హృదయాల వెనుక ఉన్న అనంతమైన ఆప్యా,యానురాగాలను చూసి తెలుగు సినీ పరిశ్రమ కళ్ళు చెమర్చాయి. ప్రతి నిత్యం నిండుగా కళకళ లాడుతూ వుండే ఆ లోగిళ్ళు ఇప్పుడు విశాదచ్చాయలతో మౌనంగా రోదిస్తున్నాయి. ఇంటి ముందు రంగరంగ వైభవంగా జరగాల్సిన చిన్న కూతురు పెళ్ళి ఇల్లుదాటి ఢిల్లీ పురవీదులు చేరడంతో చిరంజీవి కుటుంబం పడుతున్న మానసిక నరకయాతన చెప్పడానికి మాటలు చాలవు, ఈ అక్షరాలకు చేతకాదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారివి పగిలిన హృదయాలు.. పేలని తూటాలు.
చిన్న కూతురంటే ఇష్టం.. ఆ చిన్న కూతురు కలిగించిన కష్టం
చిరు చిన్న కూతురు వివాహం వారి ఇష్ట ప్రకారమే జరిగినా, ఈ రోజో రేపో వారు తప్పకుండా తిరిగి ఇంటికి వస్తారని ఆశిస్తూ, అందుకు సానుకూలంగా వుండాలని అందరూ భావించి, చిన్న కూతురుకు కష్టం కలిగించకూడదని చిరు తన వారందరికీ చెప్పిన కొంతసేపటికే, ఆ చిన్న కూతురు ఢిల్లీ చేరి, తన తల్లిదండ్రులనుంచి, వారి అభిమానులనుంచి తనకు, తన భర్త శిరీష్ భరద్వాజ్ కు రక్షణ కలిగించాలని ఢిల్లీ హైకోర్టుకు ఎక్కడంతో చిరంజీవి కుటుంబం యావత్తూ మరో శరాఘాతం తగిలినట్లు విలవిలలాడింది. తామందరూ ఎంతో ప్రేమగా చూసుకునే ఈ చిన్ని కూతురు తనంత తానుగా స్పందిస్తున్న మాటలా, లేక వెనక ఎవరైనా వుండి నడిపిస్తున్న సంఘటణలా ఎటూ తేల్చుకోలేకుండా వున్నారు. కన్న తల్లి రోదన ఒకవైపు, కన్న తండ్రి మనో వేదన మరోవైపు, ముక్కలైన బాబాయ్ హృదయం ఇంకోవైపు, మాటలకందని నరకయాతనలో మునిగిన ఆప్తులు, ఆత్మీయులు అందరూ ఏకమై అనుభవిస్తున్న మానసిక ఆవేదనతో మూగబోయిన ఆ పరిసరాలు తెలుగు సినీ జగత్తులోని మెగాస్టార్ ఇంట్లోనంటే ఎవరికీ నమ్మబుద్ది కాదు.
జనసంద్రమైన "చిరు"లోగిలి...
చిరంజీవి నివాసం వచ్చేపోయే ఆత్మీయులు, బంధువులు, అభిమానులతో జనసంద్రమైపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా, ఇతర రాష్ట్రాలలో వుండే మితృలు, బంధువులు, స్నేహితులు, అభిమానుల రాకతో జూబిలీ హిల్స్ ప్రాంతాలు జనంతో నిండిపోతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రతి నటుడూ, ప్రతి కళాకారుడూ, నిర్మాతా, టెక్నీషియన్ అనే తేడా లేకుండా దాదాపు ప్రతి ఒక్కరూ చిరంజీవిని కలిసివస్తున్నవారే. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు మొదలుకుని,పలువురు రాజకీయ నాయకులు చిరంజీవి నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చి వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా వస్తూనే వుంటారు.
రిసెప్షన్ తో ముగింపు పలకాలని అందరి ఆరాటం
శ్రీజ పెళ్ళి ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ చర్చలకు, మానసిక ఆవేదనలకు అతి త్వరలో శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ల పెళ్ళి రిసెప్షన్ ఏర్పాటు చేసి ముగింపు పలకాలని కుటుంబ సభ్యులతోబాటు, బంధువులు, స్నేహితులు, అభిమానులు కోరుకుంటున్నారు. ఆ పరంగా శ్రీజ మేన మామ అల్లు అరవింద్ ఈ పాటికే చర్యలు కూడా చేపట్టారు. వచ్చే సోమవారం ఢిల్లీ కోర్టు అడిగిన హామీ పత్రాలను సమర్పించి, వెంటనే శ్రీజ, శిరీష్ భరద్వాజ్ లను హైదరాబాదుకు తీసుకు వచ్చి "రిసెప్షన్" ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయమని చిరంజీవి కూడా తన సన్నిహితులకు చెప్పినట్లు తెలిసింది.
శ్రీవెంకట్ బులెమోని

బాలకృష్ణ "ఒక్క మగాడు" ఎక్స్ క్లూజివ్ ఫోటో గ్యాలరీ






















జే..oస్...బాండ్ కార్లు చూద్దామా...(ఫోటో గ్యాలరీ)








శ్రీజ పెళ్ళి ఫోటోలు...(గ్యాలరీ)


























































Monday, October 22, 2007

సచిన్ టెండూల్కర్ చీర కట్టాడు మరి...!


రివాల్వర్ అప్పజెప్పడానికి వెలుతూ విలేఖరులతో మాట్లాడుతున్న పవన్ కళ్యాన్ (పోటో గ్యాలరీ)

శ్రీజకు తమవల్ల ఎలాంటి అపాయం లేదని చెబుతూ శీజ బాబాయ్, హీరో పవన్ కళ్యాన్ తన రివాల్వర్ ను హైదరాబాదులోని జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పారు. శ్రీజ ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించిన నేపద్యంలో పవన్ కల్యాన్ తన రివాల్వర్ తో జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెలుతూ విలేఖరులతో మాట్లాడారు. వాటి దృష్యాలు.














మా నాన్న, మా బాబాయ్ అభయమిస్తే మేము హైదరాబాదు వస్తాము: "ఢిల్లీ హైకోర్టులో" చెప్పిన శ్రీజ


చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం సినిమా పక్కీలోనే పలు మలుపులు తిరుగుతోంది. గత బుధ వారం హైదరాబాదులో తల్లిదండృలకు తెలియకుండా పెళ్ళి చేసుకున్న చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, శిరీష్ భరద్వాజ్ లు పెళ్ళి చేసుకున్న రోజునే రోడ్డు ప్రయాణం ద్వారా గోవా చేరుకున్నారు. అక్కడ నుంచి ఢిల్లీ చేరుకున్న ఈ కొత్త జంట అడ్వకేట్ పింకీ ఆధ్వర్యంలో ఢిల్లీ లోని నార్థ్ జోన్ డి జి పి ని కలిసి మాకు రక్షణ కలిగించాల్సిందిగా విగ్నప్తి చేశారు. అలాగే పింకీ ఆద్వర్యంలెనే ఈ రోజు ఢిల్లీ లోని హైకొర్టును ఆశ్రయించిన ఈ జంట తమకు తమ బంధువులనుంచి, చిరంజీవి, పవన్ కళ్యాన్ ల అభిమానులనుంచి రక్షణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్రీజ కోర్టులో మాట్లాడుతూ తన తండ్రి చిరంజీవి, తమ బంధువులు తమ పెళ్ళిని అంగీకరించడం వల్ల తాము సంతోశంగా ఉన్నామని, అయితే ఆయన అభిమానులపై తమకు నమ్మకం లేదని చెప్ప్రు. తన తండ్రి చిరంజీవి, తన బాబాయ్ పవన్ కళ్యాన్ లు హామీ పత్రం ఇస్తే తాము ధైర్యంగా హైదరాబాదుకు వస్తామని వారు కోర్టులో చెప్పారు. రాష్ట్ర పోలీసులనుంచి ఫోన్ ద్వారా ప్రాధమిక సమాచారం తెలుసుకున్న కోర్టు, శిరీష్ భరద్వాజ్ పై ఉన్న 2002 నాటి కిడ్నాప్ కేసు విషయం ప్రశ్నించగా, అది అప్పట్లోనే సమసిపోయిందనీ, దానిని తిరగదోడడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని శిరీష్ భరద్వాజ్ కోర్టుకు తెలిపాడు. ప్రస్తుతానికి రక్షణ కలిగించాల్సిందిగా పోలీసులను ఆదేశించిన కోర్టు కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ఢిల్లీ హైకోర్టులో రక్షణ కోరిన శ్రీజ, శిరీష్ బరద్వాజ్ : పోలీసులకు తుపాకీ అందచేసిన పవన కళ్యాణ్


తమకు రక్షణ కల్పించాలంటూ చిరంజీవి ద్వితీయ కుమార్తె శ్రీజ మరియు ఆమె భర్త శిరీష్ భరద్వాజ్‌లు న్యూఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తన దగ్గరున్న రివాల్వర్‌ను సినీనటుడు పవన్ కళ్యాణ్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శ్రీజ దంపతులకు తమ నుంచి ఎటువంటి ప్రాణహాని కలుగదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన నుంచి ప్రాణాపాయం కలిగే అవకాశముందని శ్రీజ తెలిపడం పట్ల పవన్‌కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నవదంపతులు ఎక్కడ ఉన్నా... క్షేమంగా ఉండాలనే ఆశిస్తున్నామన్నారు. తమ పక్షంలో ప్రేమ, ఆప్యాయతలను పంచే అభిమానుల సమాజమే ఉందని... గూండాలు తమ వశం లేరని ఆయన ఉద్ఘాటించారు. తమ అభిమానులు ఇలాంటి ప్రాణాపాయ చర్యల్లో నిమగ్నం కారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. శిరీష్‌ను తాను ఏమీ చేయనని మీడియా సమక్షంలో హామీ ఇచ్చారు. దీనికోసం రక్షణ కోరుతూ శ్రీజ కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. శిరీష్‌పై కేసులుండటం తమకు ఆందోళన కలిగిస్తోందని అన్నారు. శ్రీజ భవిష్యత్త్‌పైనే తాము ఆందోళన చెందుతున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. శ్రీజ దంపతులు తన గృహానికి గానీ, అన్నయ్య చిరంజీవి గృహానికి గానీ వస్తే సాదర స్వాగతం పలుకుతామన్నారు.

మహేశ్ బాబు "అతిధి" అట్టర్ ఫ్లాఫ్


ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా భావించిన మహేశ్ బాబు నటించిన కొత్త చిత్రం "అతిధి" బ్లాక్ అఫీసు దగ్గర బోల్తా పడిందని సినీ ఎగ్జిబిటర్స్ రిపోర్ట్. మొదటి రోజు యావరేజ్ ఫిలిం గా వచ్చిన టాక్ సోమవవారానికి అట్టర్ ఫ్లాఫ్ గా మారి సినీ పరిశీలకుల్ని సహితం విస్మయానికి గురిచేసింది. "సినిమాలో మొత్తం ఓవర్ బిల్డప్ తప్ప మరేమీ, లేదనే" కొత్త టాక్ పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. రాష్ట్రంలోని ప్రధాన సెంటర్లు, నగరాలలో చిత్రం పరిస్థితి ప్రస్తుతం యావరేజ్ గా వుండగా, తాలూకలు, చిన్న పట్టణాలలో మరీ ధారుణంగా వుందని ఈ రోజు రిపోర్ట్. సినిమా విడుదలైన మొదటి వారంలోపలే ఈ రిపోర్ట్ రావడం దురదృష్టమని సినీ విమర్శకుల అభిప్రాయం. ముఖ్యంగా మహేశ్ బాబు గత చిత్రం "పోకిరి" తో ప్రేక్షకులు భేరీజు వేసుకుంటున్న ప్రేక్షకులకు ఈ చిత్రం ఎంత మాత్రం నచ్చడం లేదని తెలిసింది. మొదటి మూడు రోజులు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తుందనుకున్నా, అది యావరేజ్ స్థాయికి పడి పోవడం, అది కాస్తా ఈ రోజు బిలో యావరేజ్ కు పడిపోవడం ఫెయిల్యూర్ చిత్ర లక్షణాలు. అయితే ఈ చిత్రం కలెక్షన్లు మరీ ధారుణంగా పడిపోవడం మాత్రం పరిశ్రమను ఎక్కువ బాధిస్తోందని పలువురు ఫిలిం ఎగ్జిబిటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు "బంటీ ఔర్ బబ్లీ" లుగా తరున్, ఇలియానా...!



తరున్, ఇలియానా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం కథ తెలిసిపోయింది. హిందీలో వచ్చిన అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీల చిత్రం "బంటీ ఔర్ బబ్లీ" ఆధారంగా ఈ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలిసింది. హిందీ చిత్రంలో తోడు దొంగల్లా నటించిన అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీల పాత్రలను తెలుగులో తరున్, ఇలియానాలు పోశించనున్నారు. ఇక హిందీలో అమితాబ్ బచ్చన్ పోశించిన పాత్రను నటుడు జగపతి బాబు పోశించనున్నాడు. మొత్తానికి ఈ చిత్రం హిందీ "బంటీ ఔర్ బబ్లీ" ఆధారంగానే రూపొందుతోందని తెలిసింది. అయితే తెలుగులో ఏం పేరు పెట్టాలా అని దర్శక, నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది.

143...అనుకుంటున్న ఇలియానా, దిల్ రాజు..!?




టాలీవుడ్ హాటెస్ట్ భామిని ఇలియానా, హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజులు ప్రేమించుకుంటున్నారా...!? ఏమో, టాలీవుడ్ లో వినిపిస్తిన్న లేటెస్ట్ లేటెస్ట్ టాక్ ఇది. దీనిని రూమరని కొట్టిపడేయలేమంటున్నాయి కొన్ని టాలీవుడ్ జీవులు. ఇలియానా, ప్రభాస్ లతో దిల్ రాజు నిర్మించిన "మున్నా" చిత్రం ప్రారంభం కన్నా ముందునుంచే వీరి ప్రేమాయణం కొనసాగుతుందని అంటున్నారు. ఇలియానా అప్పట్లో కూడా వీరిద్దరి మద్యన ప్రేమాయణం కొనసాగుతుందని టాలీవుడ్ లో పెద్దగా రూమర్లు వినిపిస్తే, అదేం కాదు తన చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ తో ఆమాత్రం దగ్గరతనం మెయింటెయిన్ చేయడం దర్శక, నిర్మాతలకు సాధారణమే ననీ, వారు మంచి స్నేహితులని అప్పట్లో కొట్టిపడేశారు. అయితే ఆ సినిమా ముగిసిన అద్యాయం. ఇప్పుడూ అదే దగ్గరితనం మెయింటెయిన్ చేయడం వెనుక, క్లబ్బుల్లో కలుసుకోవడం వెనుక, ఫంక్షన్లలో ఖాచ్చితంగా రాసుకు పూసుకు తిరగడం వెనక, అన్నింటికీ మించి ఇలియానాను హైదరాబాదులో సెటిల్ చేయడం కోసం ల్యాంకో హిల్ల్స్ లో ఓ ఫైవ్ స్టార్ ఫ్లాట్ కొనేలా చేయడం, అందుకు తనవంతు కృషిచేయడం వెనుక ఉన్నది మొత్తం కేవలం స్నేహం మాత్రమే కాదని, ఆ స్నేహంతో బాటు కలిసిన "143..." అని టాలీవుడ్ జీవుల గోల, మరి నిజమేంటో అటు ఇలియానాగానీ, ఇటు దిల్ రాజుగానీ సమీప భవిష్యత్తులో వ్యక్తం చేస్తారని మనం భావించవచ్చా...?

చిరంజీవిని పరామర్శించిన బాలకృష్ణ




"శ్రీజ అకస్మాత్తుగా వివాహం చేసుకున్న తర్వాత తెలుగు సినీ పరిశ్రమ మొత్తం దిగ్బ్రాంతి చెందిందని" నటుడు బాలకృష్ణ అభిప్రాయ పడ్డారు. ఆయన చిరంజీవిని చిరంజీవి స్వగృహంలో కలిసి పరామర్శించారు. సతీసమేతంగా చిరంజీవి ఇంటికి వచ్చిన బాలకృష్ణ చిరంజీవి ఇంట్లో గంటకుపైగా గడిపినట్లు తెలిసింది. చిరంజీవి, ఆయన సతీనణితోబాటు ఇతర కుటుంబ సభ్యులను పలకరించిన బాలకృష్ణ "చిరంజీవి కుటుంబానికి తెలుగు సినీ పరిశ్రమతోబాటు తెలుగు ప్రజలందరూ తోడుగా ఉంటారని, శ్రీజ క్షేమంగా ఉంటుందని" ధైర్యం చెప్పినట్లు తెలిసింది.

విక్టరీ వెంకటేశ్ కింగ్ సైజ్ ఫోటో గ్యాలరీ
















గురుద్వారాలో ఒక్కటైన భూమికా చావ్లా, భరత్ ఠాకూర్


నటి భూమికా చావ్లా వివాహం తన ప్రేమికుడు భరత్ టాకూర్ తో నాసిక్ సమీపంలోని దేవ్ లాలీ క్యాం లో వున్న గురునానక్ దెవ్ గురుద్వారాలో ఎలాంటి ఆర్భాటం లేకుండా అతి సాధారణంగా జరిగింది. ఈ వివాహానికి భూమిక, భరత్ ఠాకూర్ ల సమీప బందువులు, అతి దగ్గరి స్నేహితులు మాత్రం హాజరయ్యారు. భూమిక తండ్రి వైపునుంచి పలువురు ఆర్మీ అఫీసర్లు, కొందరు బందువులు మాత్రమే హాజరయారని తెలిసింది.

బాలకృష్ణ "ఒక్క మగాడు" లోగో...


Friday, October 19, 2007

సినిమా షూటింగ్ లో అగ్ని ప్రమాదం, స్పృహ తప్పిన నటి (అగ్ని ప్రమాద దృష్యాల ఫోటోలు)

ఒక సినిమా షూటింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల అందులో నటిస్తున్న నటి సోనూ స్పృహ తప్పి పడిపోగా, సహ నటుడు శ్రీనాథ్ కొద్దిగా గాయపడటం జరిగింది. అయితే ఇది తెలుగు సినిమా షూటింగ్ సందర్భంగా జరిగింది కాదు. మన పొరుగునే ఉండే కన్నడ చిత్ర రంగంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కన్నడ చిత్ర దర్శక, నిర్మాత సూరి నిర్మిస్తున్న "ఇంతి నిన్న ప్రీతియ" చిత్రం సందర్భంగా జరిగింది. కాగా అప్పుడు ఈ సినిమాలోని పెళ్ళి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. మండపంలో ఉంచిన ఒక చిన్న దీపం ద్వారా అంటుకున్న ఈ మంటలు కొద్ది కొద్దిగా వ్యాపించడం ఆరంభించాయి. అయినప్పటికీ షూటింగ్ ను నిలిపివేయకుండా, ఆ మంటల్లోనే ఈ చిత్ర షూటింగ్ ను కొనసాగించడంతో పొగ బాగా పీల్చుకున్న నటి సోనూ స్పృహతప్పి పడిపోయింది. ఆ మంటల్లోంచి నటుడు శ్రీనాథ్ చిన్న చిన్న గాయాలతో బయట పడ్డాడు. కాగా చిత్రంలో నటిస్తున్న సోనూ, శ్రీనాథ్ లు ఇద్దరూ కొత్తవారు కావడం ఇక్కడ గమనార్హం. షూటింగ్ ముగిసిన తర్వాత ఆ మంటలను అదుపులోకి తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరిగాయని తెలిసింది. ఈ విషయమై కన్నడ చిత్ర ప్రముఖులు చిత్ర దర్శకుడు సూరిని మందలించినట్లు తెలిసింది.



మరో అద్భుత ప్రేమ కావ్యం "సావరియా" (వాల్ పేపర్స్)




రిలయన్స్ " బ్రాండ్ అంబాసిడర్" గా మహేశ్ బాబు


యంగ్ సూపర్ స్టార్ "ప్రిన్స్" మహేశ్ బాబు రిలయన్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలూ దాదాపు పూర్తయ్యాయని, ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని తెలిసింది. ఇటీవల కార్పోరేట్ కంపనీల దృష్టి మహేశ్ బాబు పై బడింది. తెలుగులో ప్రచారానికి ఇంతకు మించిన బ్రాండ్ అంబాసిడర్ ప్రస్తుతం మరెవరూ లేరని భావిస్తున్న పలు కంపనీలు మహేశ్ వైపు మొగ్గు చూయిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం యు టి వి సంస్థ మహేశ్ బాబుతో మూడు చలన చిత్రాల నిర్మాణానికి సంబంధించి సుమారు 60 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత బిగ్ ఎఫ్ ఎం, ఇప్పుడు రిలయెన్స్ సంస్థలు మహేశ్ పట్ల మక్కువ చూయించాయి. రిలయన్స్ సంస్థ కూడా తమ బ్రాండ్ అంబాసిడర్ గా మహేశ్ బాబును ఎన్నుకుంది. దీనికి సంబంధించిన ప్రాధమిక సమీక్షలు, సంప్రదింపులు, రెమ్యునరేషన్ తదితర అన్ని విషయాలకు ఆ సంస్థ, మహేశ్ బాబులు ఒక ఒప్పందానికి రావడం జరిగిందని, ఇక అధికారిక ప్రకటన మాత్రమే తరువాయీని పద్మాలయా స్టూడియోస్ వారి అనధికారిక సమాచారం.

విజయం సాధించడానికి మరీ ఇంతగా దిగజారాలా...?!





































శిరీశ్ భరద్వాజ్ తండ్రి ఇంటర్వ్యూ


చిరంజీవి చిన్న కూతురు శ్రీజను రహస్యంగా పెళ్ళి చేసుకున్న శిరీశ్ భరద్వాజ్ తండ్రి వెంకట రమణ మూర్తి మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చాడు. మీడియా వారితో మాట్లాడుతూ మెగాస్టార్ కు మనకు వియ్యం అందని ద్రాక్ష అవుతుంది, కనుక ఈ పెళ్ళి ప్రస్తావన తీసుకురావద్దని మూడునెలల ముందే హెచ్చరించానని చెప్పుకొచ్చాడు. అతని ఇంటర్వ్యూ వివరాలు.

ప్రశ్న: మీ కుమారుడు శిరీశ్ భరద్వాజ్ వివాహం చేసుకునĺ