Thursday, October 4, 2007

సీ ఎం (చిరంజీవి)తో మరోమారు నటించాలని ఉంది : కరిష్మా కొటక్


"శంకర్ దాదా జిందాబాద్" చిత్ర కథానాయకి కరిష్మా కొటక్ కు మరో మారు చిరంజీవితో నటించాలని ఉందట. ఇటీవల ముంబైలో జరిగిన ఒక ఫ్యాషన్ ర్యాంప్ లో పాల్గొన్న కరిష్మాను విలేఖరులు "మళ్ళీ ఇతర భాషా చిత్రాలలో నటిస్తారా, లేక హిందీకే పరిమితమవుతారా" అని అడిగిన ప్రష్నకు కరిష్మా కొటక్ సమాధానమిస్తూ, మిగిలిన భాషలవిషయం ఏమో గాని, తెలుగులో మాత్రం మళ్ళీ నటించాలని ఉంది, అది కూడా చిరంజీవితో నటించాలని కోరికగా ఉంది" అంటూ తన మనసులోని మాటను చెప్పేసింది. "చిరంజీవితోనే ఎందుకు అంటూ, వారడిగిన ప్రశ్నకు, "భవిష్యత్ సీ ఎం తో, నటించాలని ఎవరికి మాత్రం ఉండదు", అనేసింది. "అంటే చిరంజీవి, భవిష్యత్తులో సీ ఎం అవుతారా" అని అడగగా, "నా కయితే అవుతారనే అనిపిస్తోంది, నిజంగా కాకపోయినా, సినిమాలో అయినా తప్పకుండా ఆయన సీ ఎం పాత్ర పోశిస్తారు, ఆ పాత్ర సరసన నటించినా, నేను సీ ఎం సరసన నటించినట్లే కదా" అని నవ్వుతూ ఇంటర్వ్యూ ముగించి, మేకప్ రూంలోకి వెళ్ళిందట కరిష్మా కొటక్. దీంతో ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలిసిపోయింది. అదేంటంటే చిరంజీవి రాజకీయ ప్రవేశం చేస్తారనే ఊహాగానాలు ముంబైనికూడా బలంగానే తాకాయన్న సంగతి.

No comments: